యాప్నగరం

Amit Shah: బీజేపీ చీఫ్‌ అమిత్ షాకు స్వైన్ ఫ్లూ.. ఎయిమ్స్‌లో చికిత్స

బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రాణాంతక స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 16 Jan 2019, 11:10 pm
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ బారినపడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తనకు స్వైన్‌ ఫ్లూ వచ్చిన విషయాన్ని అమిత్ షా బుధవారం (జనవరి 16) రాత్రి ట్విటర్ ద్వారా తెలియజేశారు..
Samayam Telugu amit


‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతోంది. ఈశ్వరుడి దయ, మీ అందరి ప్రేమ, అభిమానాలతో త్వరగా కోలుకుంటా’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిస్తూ.. ఈశ్వరుడు మీకు త్వరగా స్వస్థత చేకూరుస్తారని పేర్కొన్నారు.

కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో స్వైన్ ఫ్లూ కారక ఎన్1హెచ్‌1 వైరస్ విజృంభిస్తోంది. దీంతో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు తెలంగాణలోనూ స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.