తమను అధికారంలో పీఠంలో కూర్చోబెడితే గోవాను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా రాజధాని పనాజీలో మానిఫెస్టోను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో గోవా బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి లక్ష్మీకాంత్ పరీకర్, కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపద్ నాయక్, మరికొంత మంది పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తాము అధికారంలోకి వస్తే గోవా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మానిఫెస్టోలో చేర్చారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యాటకం, వ్యవసాయ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు సులభతరం చేస్తామని మానిఫెస్టో చెబుతోంది. తాము ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపైనే దృష్టిసారించామని, రాబోయే ఐదేళ్లలో ఎంప్లాయిమెంట్ను పెంచడమే తమ ముఖ్య లక్ష్యమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
అలాగే గోవాను ప్లాస్టిక్ ఫ్రీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మానిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు రాష్ట్రానికి కల్పించనున్నట్లు బీజేపీ మానిఫెస్టోలో వివరించింది. సామాజిక సంక్షేమ పథకాలను ద్రవ్యోల్బణ సూచీకి జతచేస్తామని, చీఫ్ మినిస్టర్ రోజ్గార్ యోజన పథకంలో మార్పులుచేసి సంప్రదాయ వృత్తులను చేరుస్తామని మానిఫెస్టోలో వెల్లడించారు.
తాము అధికారంలోకి వస్తే గోవా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మానిఫెస్టోలో చేర్చారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యాటకం, వ్యవసాయ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు సులభతరం చేస్తామని మానిఫెస్టో చెబుతోంది. తాము ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపైనే దృష్టిసారించామని, రాబోయే ఐదేళ్లలో ఎంప్లాయిమెంట్ను పెంచడమే తమ ముఖ్య లక్ష్యమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
అలాగే గోవాను ప్లాస్టిక్ ఫ్రీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మానిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు రాష్ట్రానికి కల్పించనున్నట్లు బీజేపీ మానిఫెస్టోలో వివరించింది. సామాజిక సంక్షేమ పథకాలను ద్రవ్యోల్బణ సూచీకి జతచేస్తామని, చీఫ్ మినిస్టర్ రోజ్గార్ యోజన పథకంలో మార్పులుచేసి సంప్రదాయ వృత్తులను చేరుస్తామని మానిఫెస్టోలో వెల్లడించారు.