యాప్నగరం

బీజేపీని వీడుతున్నా.. యశ్వంత్ సిన్హా సంచలన ప్రకటన

బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆ పార్టీ నుంచి అన్ని బంధాలను తెంచుకుంటున్నట్లు తెలిపారు.

TNN 21 Apr 2018, 2:18 pm
బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆ పార్టీ నుంచి అన్ని బంధాలను తెంచుకుంటున్నట్లు తెలిపారు. శనివారం (ఏప్రిల్ 21) మధ్యాహ్నం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఈ విషయాన్ని తెలిపారు. ‘బీజేపీతో అన్ని రకాల బంధాలను తెంచుకుంటున్నా.. రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నా’ అని సిన్హా చెప్పారు.
Samayam Telugu yashwant-sinha


80 ఏళ్ల యశ్వంత్ సిన్హా బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. వాజ్‌పేయ్ హయాంలో ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా సేవలు అందించారు. 1998 నుంచి 2004 వరకు ఆయన మంత్రిగా సేవలు అందించారు. ఎల్‌కే అద్వానీకి అత్యంత సన్నిహితుడైన సిన్హా.. కేంద్రంలో మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై పలుమార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు.

యశ్వంత్ సిన్హా బీజేపీని వీడనున్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేసి ఈ వార్తలకు ముగింపు పలికారు. యశ్వంత్ సిన్హా పాల్గొ్న కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ నేతలు కూడా ఉన్నారు. సిన్హా కుమారుడు జయంత్ సిన్హా.. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.