యాప్నగరం

ప్రధాని మోడీ విద్యార్హతలు వెల్లడి

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను అమిత్ షా, జైట్లీలు మీడియా ముందు ఉంచారు.

TNN 9 May 2016, 5:07 pm
ఢిల్లీ:ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి జైట్లీలు మీడియా ముందు ఉంచారు. మోడీకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లపై గత కొన్ని రోజులుగా విదాదం నెలకొన్న నేపథ్యంలో అమిత్ షా, జైట్లీ ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ 1978వ ఏటా ఢిల్లీ వర్శిటీలో డిగ్రీ పట్టా పొందారని.. అలాగే గుజరాత్ వర్శిటీ నుంచి 1983లో దూర విద్య ద్వారా ఎంఏ పూర్తి చేసినట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లోనూ మోడీ ఇదే విషయాన్ని పేర్కొన్నారని అమిత్ షా,జైట్లీ వెల్లడించారు.
Samayam Telugu bjp shows pms degrees to media asks kejriwal to apologize for lies
ప్రధాని మోడీ విద్యార్హతలు వెల్లడి





క్రేజీవాల్ క్షమాపణలు చెప్పాలి...
ప్రధాని విద్యార్హతలపై ఇలా స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అమిత్ షా,జైట్లీ అన్నారు. మోడీపై తప్పుడు ఆరోపణలు చేయడం కేజ్రీవాల్ కు అలవాటుగా మారిందని... తాజాగా ఆయన విద్యార్హతలపై కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు చేశారు. అందుకే వాస్తవాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ప్రధానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను ఇలా మీడియా ముందు ప్రవేపెట్టడం జరిగిందన్నారు. కేజ్రీవాల్ తన తప్పును ఇప్పుడైనా తెలుసుకొని ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని అరుణ్ జైట్లీ, అమిషా డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.