యాప్నగరం

బీజేపీ అసలు రంగు బయటపడింది: ఓవైసీ

ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను నియమించడం అంటే లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయడమేనని ఎంఐఎం

Samayam Telugu 20 Mar 2017, 11:11 am
ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను నియమించడం అంటే లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయడమేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. అభివృద్ధి మంత్రం బీజేపీకి కేవలం నినాదం తప్ప అజెండా అంశం కాదని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu bjp tries to end the secularism and diversity of the nation says owasi
బీజేపీ అసలు రంగు బయటపడింది: ఓవైసీ


సోమవారం ఓవైసీ యూపీలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘‘నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మతరాజకీయాలకు చెక్ పెడతానని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. బీజేపీ మళ్లీ తన నిజస్వరూపాన్ని బయటపెడుతోంది. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేలా బీజేపీ చర్యలున్నాయి’’ అని ఓవైసీ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, యూపీ సీఎంగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ మాత్రం.. ‘సబ్ కా సాత్...సబ్ కా వికాస్’ అని వెల్లడించారు.

ఎంపీగా యోగి పలు మార్లు ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే సీఎం అయ్యాక మాత్రం... ‘నా ప్రభుత్వం ఏలాంటి వివక్షలకు తావు లేకుండా లోక కళ్యాణం కోసం పాటుపడుతుంది’ అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.