ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు జరగాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆదివారం నాడు నిర్వహించిన మనసులో మాట (మన్ కి బాత్) రేడియో ప్రసంగం సందర్భంగా ఆయన భారత రాజకీయాలు, ఎన్నికల ప్రహసనం లాంటి అంశాలను కూడా ప్రస్థావించారు. మనది అతి పెద్ద దేశమని ప్రతీ సారి ఎన్నికలు జరిగినప్పుడు మద్యం రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కుతుందని, ఇబ్బడిముబ్బడిగా నగదు పంపిణీ చేస్తారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణమన్నారు. ఎన్నికల్లో ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలని తమ పార్టీ కోరుకుంటోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరగడమే కాకుండా, ప్రజాస్వామ్యం సుధృడమవుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలైతే మేలన్న మోడీ
ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు జరగాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
TNN 25 Sep 2016, 7:32 pm