ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీ వర్గాలకు దక్కే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భులందర్ షా లో పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ విధానాలనే బీజేపీ ఫాలో అవుతుందని ఆమె అన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాల్లో మతస్వేచ్ఛను హరించడానికి బీజేపీ ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాయావతి ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో దళితులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు హక్కులు కోల్పోతాయని ఆమె అన్నారు.
తప్పుడు ఒపినియన్ పోల్స్ తో కాంగ్రెస్, బీజేపీ, ఎప్పీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అసలు ఫలితాలు వచ్చాక ఎవరు విజేతలో తెలుస్తుందని ఆమె అన్నారు. స్వార్థంతో కాంగ్రెస్ ఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయని ఆమె విమర్శించాయి.
ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4 , 8తేదీల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాల్లో మతస్వేచ్ఛను హరించడానికి బీజేపీ ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాయావతి ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో దళితులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు హక్కులు కోల్పోతాయని ఆమె అన్నారు.
తప్పుడు ఒపినియన్ పోల్స్ తో కాంగ్రెస్, బీజేపీ, ఎప్పీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అసలు ఫలితాలు వచ్చాక ఎవరు విజేతలో తెలుస్తుందని ఆమె అన్నారు. స్వార్థంతో కాంగ్రెస్ ఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయని ఆమె విమర్శించాయి.
ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4 , 8తేదీల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.