యాప్నగరం

ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల మృతి

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నారు.

Samayam Telugu 29 Oct 2020, 10:46 pm
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను కాల్చి చంపారు. ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. గురువారం (అక్టోబర్ 29) కుల్గామ్ జిల్లాలోని వైకే పొరా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్నంతటినీ తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా దళాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Samayam Telugu ఫైల్ ఫోటో
3 BJP Workers Killed in Terrorist Attack in Jammu Kashmir Kulgam


ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన బీజేపీ కార్యకర్తలను ఫిదా హుస్సేన్ యతూ, ఉమర్ రషీద్ బేగ్, ఉమర్ రంజాన్ హజమ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హుస్సేన్ యతూ తండ్రి గులామ్ అహ్మద్ యతూ బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


Must Read: పాక్ పార్లమెంట్‌లో మోదీ నినాదాలు

Also Read: పాక్‌కు ఊహించని షాకిచ్చిన సౌదీ ప్రభుత్వం.. భారత్‌కు దీపావళి గిఫ్ట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.