యాప్నగరం

కోల్‌కతాలో బీజేపీ కార్యాలయంపై దాడి

పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలు ఉద్రిక్త రూపం దాలుస్తున్నాయి.

TNN 3 Jan 2017, 8:25 pm
పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలు ఉద్రిక్త రూపం దాలుస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) - బీజేపీల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. టీఎంసీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎంసీ వర్గాలు భగ్గుమన్నాయి. కోల్‌కతాలోని బీజేపీ ప్రధానకార్యాలయపై దాడికి దిగాయి. రాళ్లు విసిరాయి, అక్కడున్న వాహనాలు ధ్వంసం చేశాయి. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు వారిపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Samayam Telugu bjps kolkata headquarters attacked by tmc student wing
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయంపై దాడి


రూ.17 వేల కోట్ల విలువైన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ సంస్థ చేసిన అవినీతిలో టీఎంసీకి చెందిన ఇద్దరు ఎంపీల హస్తం ఉందని సీబీఐ పేర్కొంది. అందుకే వారిద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపింది. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం తాను నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతోనే మోడీ ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని పేర్కొన్నారు. అందుకే తన పార్టీ ఎంపీలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు. అయినా నోట్ల రద్దుపై తన పోరాటం ఆపనని ప్రకటించారు. ఎంపీల అరెస్టు విషయమై చట్టబద్ధంగా పోరాటం చేస్తానని కూడా చెప్పారు. కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.