యాప్నగరం

కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన బీజేపీ కీలక నేత

బీజేపీకి చెందిన కీలక నేత, తరుచూ మీడియాలో కనిపించే జాతీయ అధికార ప్రతినిధి కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఆయనకు కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌లో చేరారు.

Samayam Telugu 28 May 2020, 3:36 pm
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌లో చేరారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో ఆయన చేరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో సంబిత్ పాత్రా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో గురువారం చేరినట్టు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా లక్షణాలు బయటపడినట్టు తెలుస్తోంది. తరుచూ మీడియాలో కనిపించే బీజేపీ నేతల్లో సంబిత్ పాత్రా ఒకరు. సోషల్ మీడియాలోనూ ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. గురువారం సైతం ఆయన పలు ట్వీట్లు చేశారు.
Samayam Telugu సంబిత్ పాత్రా


ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌ గాంధీని అవమానిస్తూ ట్వీట్లు చేశారన్న ఆరోపణలపై సంబిత్‌ పాత్రాపై పరువునష్టం దావా కేసు నమోదైంది. మహారాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బ్రిజ్‌కిశోర్‌ దత్తా కళ్యాణ్‌లోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెహ్రూ, రాజీవ్‌ను అవమానిస్తూ, అలాగే కాంగ్రెస్‌ హయాంలో కరోనా ప్రబలి ఉంటే కుంభకోణాలు జరిగేవని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారని, అందుకే ఆయనపై కేసు వేశానని దత్తా పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.