యాప్నగరం

భాష ఏదైనా మనమంతా ఒక్కటే: మోదీ

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కఠోర శ్రమ, సరైన వ్యూహం వల్లే కర్ణాటకలో విజయం సాధ్యమైందన్నారు.

TNN 15 May 2018, 9:27 pm
కర్ణాటకలో బీజేపీ విజయం అసాధారణమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఆయన... ఎన్నికల్లో గెలుపుపై స్పందించారు. భాష ఏదైనా మనమంతా ఒక్కటేనని ఈ ఫలితాలు నిదర్శమని... ఉత్తరాది పార్టీ అని బీజేపీపై ఉన్న మచ్చను కూడా చెరిపేశాయన్నారు. విభజించు పాలించూ సిద్ధాంతాన్ని కూడా ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. బురదలోనే కమలం వికిసిస్తుందన్న ప్రధాని... దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు పార్టీ చేరువయ్యిందన్నారు.

ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడచాయని... వారి కుట్రల్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు మోదీ. కర్ణాటక అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని... ఈ విజయం కోసం కష్టపడిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఇటు కర్ణాటకలో గెలిచామన్న ఆనందం... అటు వారణాసిలో ఫ్లై ఓవర్ కూలిపోయిందన్న బాధ వెంటాడుతోందన్నారు.

బీజేపీని ఇప్పటి వరకు హిందీ భాషా పార్టీ అనేవాళ్లు.. అయితే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, అసోం ఇవేవీ హిందీ రాష్ట్రాలు కావన్నారు. కర్ణాటక విజయంతో ఆ అపవాదు వాస్తవం కాదని తేలిందన్నారు. కర్ణాటక ప్రజలు ఎలాంటి భేదభావాలు లేకుండా తనను ఆదరించారని మోదీ అన్నారు. అంతకు ముందు ట్విట్టర్‌లో స్పందించిన మోదీ.. కర్ణాటక ప్రజలకు కృతజ్ఞ‌తలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.