వేసవికి తోడు తీవ్రమైన బొగ్గు కొరత దేశంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలకు దారితీస్తోంది. ఇది దేశీయ విద్యుత్ సంక్షోభం గురించి ఆందోళనలను మరింత పెంచుతోంది. ప్రచండ భానుడు నిప్పుల సెగలు కక్కడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ లేకపోవడంతో ఉత్తరాదిలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్.. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 8 గంటల వరకూ కొనసాగుతోంది. దేశంలో విద్యుత్ కోతలు అసాధారణం కాకపోయినా.. ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే వస్తోంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. విద్యుత్ కోరత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి ఆజ్యం పోసిన ఇంధన ధరలను నియంత్రించేందుకు విధాన రూపకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో ద్రవ్యోల్బణం కూడా పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మెటల్, అల్లాయ్, సిమెంట్ సహా చిన్న, పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. నోమురా హోల్డింగ్స్ ఇంక్ ప్రకారం.. నిరంతర బొగ్గు కొరత దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిపై భారం పడుతుంది.. ఆకస్మిక కుదుపునకు దారితీస్తుంది.
దీనికి ‘‘డిమాండ్, సరఫరా కారకాలు రెండూ బాధ్యత వహిస్తాయి’’ అని జపాన్ బ్యాంక్ నిపుణుడు సోనాల్ వర్మ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు ఏప్రిల్ 19న ఒక పరిశోధనా నోట్లో రాశారు. కరోనా తగ్గుముఖం పట్టి కార్యకలాపాలు పునఃప్రారంభం కావడం, వేసవి వంటివి విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణం. మార్చి 2021 నాటికి స్థూల దేశీయోత్పత్తి 6.6% కుదించిన తర్వాత పూర్తిస్థాయి వృద్ధికి తిరిగి రావాలని భారత్ భావిస్తోంది. అయితే, ప్రధాన ద్రవ్యోల్బణం మార్చిలో 17-నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది రిజర్వు బ్యాంకు నిర్దేశించిన లక్ష్యం 6% కంటే ఎక్కువగా ఉంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. వడగాలులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 9న 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏప్రిల్ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. మార్చిలో జాతీయ సగటు దాదాపు 92 డిగ్రీలకు చేరుకుంది. 1901లో రోజువారీ ఉష్ణోగ్రతల లెక్కింపు ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.
విద్యుత్తు కోతలతో దేశంలోని పలు ప్రాంతాల్లో టెక్స్టైల్ మిల్లులు కార్యకలాపాలను నిలిపివేశాయి. పత్తి, జనరేటర్లలో వాడే డీజీల్ ధరలు రికార్డుస్థాయిలో పెరగడమే ఇందుకు కారణమని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ గణత్రా తెలిపారు.
దేశంలో 150 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉండగా.. 81 కేంద్రాల్లో నిల్వలు తీవ్రస్థాయికి చేరాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో గృహవసరాలకు విద్యుత్ వాడకం ప్రమాదంలో పడింది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 54 ప్లాంట్లలో 28 కేంద్రాల్లో కొరత తీవ్రస్థాయికి స్థాయికి చేరిందని వివరించింది.
అయితే, దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం విశేషం. ప్రస్తుతం కోల్ ఇండియా వద్ద 72.5 మిలియన్ టన్నులు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. రోజూ సగటున 2.1 మిలియన్ టన్నుల బొగ్గు ప్లాంట్లకు వస్తోందని, బొగ్గు కొరతకు అవకాశమే లేదని వెల్లడించాయి. పవర్ ప్లాంట్ల వద్ద 10 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా.. మొత్తంగా 30 రోజులకు అవసరమైన నిల్వలు ఉన్నాయని చెప్పాయి.
ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి ఆజ్యం పోసిన ఇంధన ధరలను నియంత్రించేందుకు విధాన రూపకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో ద్రవ్యోల్బణం కూడా పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మెటల్, అల్లాయ్, సిమెంట్ సహా చిన్న, పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. నోమురా హోల్డింగ్స్ ఇంక్ ప్రకారం.. నిరంతర బొగ్గు కొరత దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిపై భారం పడుతుంది.. ఆకస్మిక కుదుపునకు దారితీస్తుంది.
దీనికి ‘‘డిమాండ్, సరఫరా కారకాలు రెండూ బాధ్యత వహిస్తాయి’’ అని జపాన్ బ్యాంక్ నిపుణుడు సోనాల్ వర్మ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు ఏప్రిల్ 19న ఒక పరిశోధనా నోట్లో రాశారు. కరోనా తగ్గుముఖం పట్టి కార్యకలాపాలు పునఃప్రారంభం కావడం, వేసవి వంటివి విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణం. మార్చి 2021 నాటికి స్థూల దేశీయోత్పత్తి 6.6% కుదించిన తర్వాత పూర్తిస్థాయి వృద్ధికి తిరిగి రావాలని భారత్ భావిస్తోంది. అయితే, ప్రధాన ద్రవ్యోల్బణం మార్చిలో 17-నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది రిజర్వు బ్యాంకు నిర్దేశించిన లక్ష్యం 6% కంటే ఎక్కువగా ఉంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. వడగాలులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 9న 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏప్రిల్ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. మార్చిలో జాతీయ సగటు దాదాపు 92 డిగ్రీలకు చేరుకుంది. 1901లో రోజువారీ ఉష్ణోగ్రతల లెక్కింపు ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.
విద్యుత్తు కోతలతో దేశంలోని పలు ప్రాంతాల్లో టెక్స్టైల్ మిల్లులు కార్యకలాపాలను నిలిపివేశాయి. పత్తి, జనరేటర్లలో వాడే డీజీల్ ధరలు రికార్డుస్థాయిలో పెరగడమే ఇందుకు కారణమని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ గణత్రా తెలిపారు.
దేశంలో 150 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉండగా.. 81 కేంద్రాల్లో నిల్వలు తీవ్రస్థాయికి చేరాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో గృహవసరాలకు విద్యుత్ వాడకం ప్రమాదంలో పడింది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 54 ప్లాంట్లలో 28 కేంద్రాల్లో కొరత తీవ్రస్థాయికి స్థాయికి చేరిందని వివరించింది.
అయితే, దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం విశేషం. ప్రస్తుతం కోల్ ఇండియా వద్ద 72.5 మిలియన్ టన్నులు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. రోజూ సగటున 2.1 మిలియన్ టన్నుల బొగ్గు ప్లాంట్లకు వస్తోందని, బొగ్గు కొరతకు అవకాశమే లేదని వెల్లడించాయి. పవర్ ప్లాంట్ల వద్ద 10 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా.. మొత్తంగా 30 రోజులకు అవసరమైన నిల్వలు ఉన్నాయని చెప్పాయి.