యాప్నగరం

Delhi: రూ.150 ఇవ్వలేదని తండ్రి హత్య

రూ.150లు అడిగితే ఇవ్వలేదని తండ్రినే కత్తితో పొడిచి చంపేశాడు ఓ మైనర్ బాలుడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 15 Jan 2019, 9:12 am

ప్రధానాంశాలు:

  • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది
  • రూ.150 ఇవ్వలేదని ఓ మైనర్ బాలుడు తండ్రిని హత్య చేశాడు
  • పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu delhi murder
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ.150 ఇవ్వలేదని ఆగ్రహించిన 17ఏళ్ల యువకుడు తండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన దిల్లీలోని న్యూ అశోక్‌నగర్‌లో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని హజారీ ముఖియా(42)గా గుర్తించారు.
తమ కుమారుడు 150 రూపాయలు అడిగితే తన భర్త లేదని చెప్పాడని దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఆగ్రహంతో తన కొడుకు తండ్రిని కత్తితో అనేకసార్లు పొడిచి పారిపోయాడని చెప్పింది. తన భర్తను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారని వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.