యాప్నగరం

కెమికల్ గోదాంలో పేలుడు.. 12 మంది మృతి

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో వెంటనే 26 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు.

Samayam Telugu 5 Nov 2020, 9:12 am
గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లో ఓ రసాయనాల గోదాములో జరిగిన భారీ అగ్నిప్రమాదం పలువురు ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 9 మంది గాయపడ్డారు. పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ దుర్ఘటన జరిగింది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . దీంతో పేలుళ్లు కూడా సంభవించాయి. ప్రమాదం ధాటికి గోదాం పైకప్పు కుప్పకూలింది.
Samayam Telugu కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
chemical factory blast


చుట్టుపక్కల వాళ్లు గోదాంలో భారీ పేలుళ్లు జరిగాయిన చెబుతున్నారు. మొత్తం ఆరు సార్లు గట్టిగా పేలిన శబ్ధాలు వచ్చాయని తెలిపారు. పేలుళ్లకు భయంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. 9 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.

Read More: కోర్టులో కేకలు వేసిన అర్ణబ్ గోస్వామి... 14వరకు జ్యుడీషియల్ కస్టడీ

శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని పోలీసులు రక్షించారు. గాయపడ్డవారిని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించారు. గోదాంలో కొన్ని అనుమానాస్పద రసాయనాలు నిలవు చేసి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాటి వల్లే పేలుడు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.