యాప్నగరం

కోసీ నదిలో బోటు మునక.. 8 మంది మృతి

నదిలో పడవ మునిగిన ఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. బీహర్ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 29 Apr 2018, 8:33 pm
నదిలో పడవ మునిగిన ఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. బీహర్ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కోసీ నదిలో విహారానికి వెళ్లిన 15 మందితో కూడిన పర్యాటక బోటు ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ఏడుగురిని రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu kosi


బీహార్‌లో గత జనవరి 31న గంగానదిలోనూ బోటు మునిగిన ఘటనలో అయిదుగురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. పాట్నాకు సమీపంలోని ఫతువా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా మహిళలే. మాఘ పూర్ణిమ సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఫతువాలోని మస్తానా ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం బోటింగ్ కోసం అనేక మంది పర్యాటకులు క్యూ కట్టారు. ఈ సమయంలో విషాదం చోటు చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.