యాప్నగరం

నదిలో మునిగిపోయిన పడవ, ముగ్గురు మృతి

బీహార్‌లో విషాధ ఘటన చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడి ముగ్గురు చనిపోగా, మిగతా వారు గల్లంతయ్యారు. మునిగిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Samayam Telugu 19 Jan 2022, 4:28 pm

ప్రధానాంశాలు:

  • బీహార్‌లోని ఘోర పడవ ప్రమాదం
  • పడవలో ప్రయాణిస్తోన్న రైతులు, మహిళలు
  • సహాయక చర్యలు చేపడుతోన్న అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పడవ ప్రమాదం
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గోపాల్‌గంజ్‌లోని భగవాన్‌పుర్ దగ్గర గండక్ అనే నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 20 మందికిపైగా గల్లంతయ్యారు. సంబంధిత అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పడవలో రైతులు, మహిళలు ఉన్నారు. రైతులు వ్యవసాయం పనుల నిమిత్తం నదిలో నుంచి మరో వైపునకు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకున్నారు.
పడవ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందినట్టు సమాచారం. ఇందులో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరని ఇంద్రజిత్ సింగ్, ఇంకొకరిని జాదోపూర్‌లోని బరాయిపట్టి నివాసిగా గుర్తించారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. నదిలో మునిగిపోయిన వారికోసం గాలిస్తున్నాయి.

అయితే పడవ చాలా పెద్దది కావడంతో ఇందులో ఓ ట్రాక్టర్‌‌ను ఎక్కించారు. ప్రయాణిస్తుండగా పడవపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఎవరో స్టార్ట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పడవలో ఉన్న 24 మంది నదిలో పడిపోయారు. కుచయ్‌కోట్, విషంభర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని గల గ్రామాల రైతులు పడవలో ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.