యాప్నగరం

గంగానదిలో ఘోర పడవ ప్రమాదం.. పలువురు గల్లంతు

ఇప్పటి వరకు రెస్క్యూ టీం పలువురుని ప్రాణాలతో కాపాడింది. ఒకరు మరణించినట్లుగా అధికారులు నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Samayam Telugu 5 Nov 2020, 2:20 pm
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. భాగల్పూర్‌లోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలోని గంగానదిలోని నవగాచియా టీన్‌షాంగ్‌ షిప్‌ ఘాట్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 70 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో పడవలో వందమంది వరకు ఉన్నట్లు సమమాచారం. 30 మంది సురక్షితంగా బయటపడగా.. మిగిలినవారి ఆచూకీ లభ్యం కాలేదని అన్నారు. రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu బీహార్‌లో పడవ ప్రమాదం
boat accident


Read More: బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ సందర్భంగా ప్రమాదం నుంచి బయటపడ్డ రేణు దేవీ అనే మహిళ మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పలు విషయాలు వెల్లడించింది. దాదాపు 100మందికి పైగా బోటు ప్రయాణిస్తుర్నాని తెలిపింది. ఒక్కసారిగా పడవ నీటిలో మునిగిపోవడం జరిగిందని తెలిపింది. తనను రెస్క్యూ సిబ్బంది ఎలా ప్రాణాలతో కాపాడారో తనకే తెలియదంది. అనేకమంది నీటిలో గల్లంతయ్యారని రేణు దేవీ పేర్కొంది. దీంతో ఘటన స్థలానికి బాధితుల బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తమవారి ఆచూకీ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.