యాప్నగరం

సంక్రాంతి వేడుకల్లో విషాదం.. పడవ బోల్తా, ఆరుగురి మృతి

మకర సంక్రాంతి వేళ సంప్రదాయ పూజలు నిర్వహిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మరణించారు.

Samayam Telugu 15 Jan 2019, 8:10 pm
ర్మదా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లాలో మంగళవారం (జనవరి 15) మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు 36 మందిని రక్షించారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మకర సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ పూజల్లో పాల్గొనేందుకు పడవలో సుమారు 60 మంది ప్రయాణికులు వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రమాద విషయం తెలియగానే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారంతా ఉత్తర మహారాష్ట్రలోని ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కినందుకే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూజా కార్యక్రమం పూర్తైన తర్వాత పడవ ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.