యాప్నగరం

రాజ్యసభ మహిళా ఎంపీపై బాంబు దాడి

జేడీయూ రాజ్యసభ సభ్యురాలు కహకషాన్ పర్వీన్ పై బాంబు దాడి జరిగింది. బిహార్ లోని భగల్ పూర్ లో మున్సిపల్

Samayam Telugu 1 May 2017, 5:27 pm
జేడీయూ రాజ్యసభ సభ్యురాలు కహకషాన్ పర్వీన్ పై బాంబు దాడి జరిగింది. బిహార్ లోని భగల్ పూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గురించి కార్యకర్తలతో పర్వీన్ చర్చిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆమె తప్పించుకోగా.. ఆరుగురు జేడీయూ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu bomb attack on jdu mp kahkashan parveen in bihar
రాజ్యసభ మహిళా ఎంపీపై బాంబు దాడి


బాంబుదాడికి పాల్పడ్డవారిలో ఒకర్ని పోలీసులు అరెస్టు చేశారు.
కహకషాన్‌ పర్వీన్‌ భగల్‌పూర్‌లోని తన నివాసంలో ఆదివారం మాట్లాడుతుండగా రాత్రి 7:30 గంటలకు కరెంట్‌ పోయింది. ఈ సమయంలో దుండగులు ఆమెపైకి బాంబులు విసిరారు. అయితే అవి ఆమె కాస్త దూరంలో పడటంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు దాడిలో గాయపడిన ఆరుగురిలో ఎంపీ పర్వీన్‌ తండ్రి కూడా ఉన్నారు. భూతగాదాల కారణంగానే బాంబుదాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.