యాప్నగరం

టెర్రరిస్థాన్‌ చొరబాట్లకు మరో సాక్ష్యం

ఉగ్రవాదులు చొరబడేందుకు బాంబులు విసురుతూ, కాల్పులు జరుపుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేశారు

Samayam Telugu 22 Oct 2016, 2:45 pm
పాకిస్థాన్ తీవ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్ లోని హీరానగర్ సెక్టార్ సరిహద్దుల్లో బుధవారం రాత్రి పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు తీవ్రవాదులు బీఎస్ఎఫ్ పోస్ట్ పై బాంబు విసిరుతూ, కాల్పులు జరుపుతున్న దృశ్యాలను భద్రతా బలగాలు చిత్రీకరించాయి.
Samayam Telugu bombs thrown pak terrorists ducking for cover bsf releases pictures of infiltration
టెర్రరిస్థాన్‌ చొరబాట్లకు మరో సాక్ష్యం

ఉగ్రవాదులు చొరబడేందుకు బాంబులు విసురుతూ, కాల్పులు జరుపుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో భారత్ జవాన్లు దీటుగా జవాబిచ్చారు. ఇండియన్ ఆర్మీ కాల్పులను తప్పించుకునేందుకు పాక్ ఉగ్రవాదులు...పొగమంచులో తప్పుంచుకునేందుకు ప్రయత్నిస్తుండటం ఫొటోల్లో చూడొచ్చు.

తీవ్రవాదులు రాకెట్లు, గ్రానైట్లు విసిరినట్లు బిఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు తీవ్రవాదులు చనిపోయారు.

శుక్రవారం ఉదయం ఖతువాలో పాకిస్థాన్ ఆర్మీ, తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో గుర్నమ్ సింగ్ అనే భారత జవాను తీవ్రంగా గాయపడ్డారు. హీరా నగర్ లోని జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు చనిపోయారు. అయితే పాక్ మాత్రం తమవైపు ఏలాంటి మరణాలు చోటు చేసుకోలేదని చెబుతోంది.
సెప్టెంబర్ 28న పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులు చేసినప్పటి నుంచి సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ముప్పైసార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.