యాప్నగరం

చైనాతో జరిగిన చర్చల వివరాలను వెల్లడించిన ఆర్మీ.. సారాంశమిదే!

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకుంది.

Samayam Telugu 25 Jun 2020, 10:15 am
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సోమవారం రెండో దఫా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను సైన్యం మంగళవారం వెల్లడించింది. ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి అధికారుల మధ్య చూశూల్‌లోని మోల్డోలో 10 గంటలపాటు చర్చలు జరిగినట్టు తెలిపింది. తూర్పు లడఖ్‌లోని ఏర్పడిన ఉద్రిక్తతలను స్నేహపూర్వక, సానుకూల, నిర్మాణాత్మక వాతావరణం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు సైన్యాలూ నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయని వివరించారు. ఉద్రిక్తత ప్రాంతం నుంచి ఇరు దేశాలూ సైన్యాలను వెనక్కు మళ్లించాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశాయి.
Samayam Telugu చైనాతో చర్చల వివరాలు వెల్లడించిన ఆర్మీ
India China Border Standoff


నిర్ణయించుకున్న ప్రకారం తప్పకుండా సమన్యాయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. తూర్పు లడఖ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వివాదాస్పద ప్రాంతాల్లో నెలకున్న ప్రతిష్టంభనపై విస్తృత చర్చ జరిగిందని పేర్కొన్నాయి. బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మోల్డోలో తీసుకున్న నిర్ణయాలను ఇరు దేశాలూ తప్పకుండా అమలుచేస్తాయని ఆర్మీ తెలిపింది.

మరోవైపు, చైనా విదేశాంగ శాఖ సైతం మంగళవారం కీలక ప్రకటన చేసింది. సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భారత్, చైనాలు అంగీకరించాయని తెలిపింది. గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణతో ఏర్పడిన ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించింది. అయితే, గాల్వన్ ఘర్షణల్లో 40 మంద వరకు తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని వస్తున్న వార్తల్లో నిజంలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జూ లింజియాన్ ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.