యాప్నగరం

భారత్‌పై దొంగ దెబ్బ.. చైనా అక్కసుకు కారణమిదేనా?

సరిహద్దుల్లో భారత సైనికులపై సోమవారం రాత్రి చైనా సైన్యం హఠాత్తుగా దాడిచేసిన ఘటనలో 20 మంది వరకు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.

Samayam Telugu 17 Jun 2020, 9:57 am
సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 1975 తర్వాత భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో అత్యధిక ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో సైన్యం పరంగా భారత్ చవిచూసిన అతిపెద్ద నష్టాలలో ఒకటి కావడంతో దీనికి ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. చైనా దుస్సాహసాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్... సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. తరుచూ అనేక ఏళ్లుగానే భారత భూభాగంలోకి చైనా చొరబాటుకు ప్రయత్నిస్తోంది. రక్షణ శాఖ వర్గాల ప్రకారం.. ఇటీవల కాలంలో చైనా భారత్ భూభాగంలోకి మరింత దూకుడగా చొరబడటం ఇదే తొలిసారి.
Samayam Telugu భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ
China India Border Row


Read Also: మానవ హక్కుల మనుగడే ప్రశ్నార్థకమైన దేశమా? మాకు నీతులు చెప్పేది

ఈసారి పాంగాంగ్ సరస్సు, నాథులా కనుమ, గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ ముఖాముఖిగా మారింది. ఎల్ఏసీ వద్ద రాతి గోడకు సమీపంలో చైనా సైన్యం ఉనికి కొనసాగుతుంది. తాజా పరిణామాలతో ఉద్రిక్తతలు తగ్గింపునకు చైనా ప్రయత్నిస్తుందా? లేదా దీనిని కొనసాగిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఘర్షణ పెరగకుండా దౌత్యపరంగా వివాదం పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే, ఇదే సమయంలో సరిహద్దు మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Read Also: ముందు దేశం.. తర్వాతే ఏ వేడుకలైనా: అమర జవాన్ చివరి మాటలు
ఈ ఏడాది భారత భూభాగంలోకి చొరబాట్లను చైనా ఎందుకు చేపట్టందనేది ఓ పెద్ద ప్రశ్న.. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో చైనా వ్యతిరేక దేశాలతో సంబంధాలను భారత్ పెంచుకోవడంతో డ్రాగన్‌కు ఇది కొంత కంటగింపుగా మారిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హాంకాంగ్ వ్యవహారం, ఆర్థిక సంక్షోభం, అమెరికాతో పెరుగుతున్న దూరం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఉండటంతో చైనా ఈ వ్యూహానికి తెరతీసినట్టు తెలుస్తోంది. భారత్‌ను గందరగోళానికి గురిచేసి, సమతౌల్యతను దెబ్బతీసి, భూభాగాలను ఆక్రమించుకుని అవమానించడం ద్వారా తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అమెరికా సహా ఇతర దేశాలకు బలమైన సంకేతాలు పంపేందుకు ఇలాంటి చర్యలు చేపట్టంది.

Read Also: నాన్న కల నెరవేర్చడం కోసం.. పసితనం నుంచే దేశం కోసం తపన!
కానీ, ఈ విషయంలో చైనా తక్కువ అంచనా వేసింది. ఒకవేళ ప్రపంచ శక్తిగా భారత్‌ను భావించకపోయినా రాజకీయంగా బలంగా ఉంది. రెండోది గత కొన్ని రోజులుగా చైనా చర్యలు ఆ దేశం కోరుకున్నదానికి భిన్నంగా ఉన్నాయి. దీంతో పశ్చిమ దేశాలతో భారత్‌కు మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. మూడోది సైనిక ప్రతీకారం కంటే, ఆర్థికపరమైన చర్యలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది.

Read Also: షాకింగ్: చైనాతో ఘర్షణల్లో 20 మంది జవాన్ల వీరమరణం
మరోవైపు, భారత్-చైనా 70వ వార్షికోత్సవ వేడుకలను ఈ ఏడాది నిర్వహించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. కానీ, ప్రస్తుత పరిణామాలతో దీనిని నిర్వహించే అవకాశం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేయనుంది. చైనా పెట్టుబడులను ముందస్తు అనుమతి జాబితాలో పెట్టిన తరువాత, భారత మార్కెట్‌ను నెమ్మదిగా పటిష్ఠం చేయడంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. దీని వల్ల చైనా కంపెనీలకు అవకాశాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం హువాయ్‌కి ఇప్పటికే భారతదేశంలో 5 జి మార్కెట్‌ అవకాశాలు చాలా మసకబారాయి. అయితే మొదట, భారత భూభాగం నుంచి చైనీయులను వెనక్కు పంపడానికి మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Read Also: Ladakh: గాల్వాన్ లోయలో ఏం జరుగుతోంది.. చైనా ప్లాన్ ఏంటి?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.