యాప్నగరం

సరిహద్దు ప్రతిష్టంభన: చైనా డిమాండ్‌కు నో చెప్పిన భారత్

గత ఆరు నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపాయి.

Samayam Telugu 23 Oct 2020, 9:43 am
భారత్, చైనాల మధ్య తూర్పు లడఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ఇరు దేశాల దౌత్య, సైనిక అధికారుల మధ్య పలుసార్లు చర్చలు జరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఘర్షణ నెలకున్న అన్ని ప్రాంతాల నుంచి తక్షణమే బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బలగాల ఉపసంహరణకు ముందే సాయుధ, సైనిక దళాల విస్తరణకు అంగీకరించాలని కోరుతుంది.
Samayam Telugu తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన
File photo


అయితే, దీనికి భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే భారత్ కంటే చైనా తన దళాలు, ఆయుధాలను సులువుగా తరలించడానికి అవకాశం ఉంది. ‘సెప్టెంబరు 10 మాస్కో వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎల్ఏసీ వెంబడి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్, చైనాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలను కొనసాగిస్తున్నాయి’ అని శ్రీవాస్తవ తెలిపారు.

సెప్టెంబరు 30న ఇరు దేశాల దౌత్యస్థాయి చర్చలు, అక్టోబరు 12న ఏడో విడత సైనిక అధికారుల మధ్య చర్చలు జరిగినట్టు గుర్తుచేశారు.
‘పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సైనిక, దౌత్యస్థాయి చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలనే కాంక్షను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.