యాప్నగరం

బ్రిటన్ ప్రధాని థెరిస్సామేకు ఘన స్వాగతం

వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు భారత్ గడ్డపై అడుగుపెట్టిన బిట్రన్ ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

TNN 7 Nov 2016, 10:21 am
వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు భారత్‌ గడ్డపై తొలి సారిగా అడుపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిస్సామే కు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే భారత దౌత్యాధికారులు, ప్రొటోకాల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. భారత్, యూకేల మధ్య మరింత స్నేహ, వ్యాపార సంబంధాలే లక్ష్యంగా థెరిస్సా పర్యటన సాగనుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఢిల్లీలో జరిగే టెక్ సమ్మిట్ లో యూకేకు చెందిన 40కి పైగా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో థెరిస్సామే పాల్గొని ప్రసంగిస్తారు.
Samayam Telugu bretain pm theresa may india tour
బ్రిటన్ ప్రధాని థెరిస్సామేకు ఘన స్వాగతం




ఈ సందర్భంగా థెరిస్సామే గౌరవార్థం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆమె పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోడీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తారు. బ్రెగ్జిట్ సమ్మిట్ తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, పాక్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రెండు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు సాగనున్నాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.