యాప్నగరం

Marriage పూటుగా తాగి పెళ్లిపీటలపైనే గుర్రుపెట్టి నిద్రపోయిన వరుడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న వధువు

కాసేపట్లో వధువు నుదుట తిలకం దిద్ది.. ఏడుడగులు నడవడమే తరువాయి.. అయితే, వరుడి చేసిన పనికి వధువుకు ఒళ్లు మండి పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. పెద్దలు ఊరికే అనలేదు. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతాయని. అందకు ఈ ఘటనే ఉదాహరణ. ఇక్కడ వేదమంత్రాలతో పురోహితుడు పెళ్లి జరిపిస్తున్నాడు కానీ, శాస్త్రోక్తంగా ఆయన చెప్పే మాటలను వినే పరిస్థితుల్లో పెళ్లి కొడుకు లేడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 12 Mar 2023, 11:26 am

ప్రధానాంశాలు:

  • కళ్యాణమండపంలోకి తాగొచ్చిన వరుడు
  • పీటల మీద నుంచి దిగిపోయిన వధువు
  • గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసిన బంధువులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sleeping Groom
కళ్యాణవేదికపై వధూ వరులు (Bride Groom) కూర్చుని ఉండగా.. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు అతిథులతో సందండిగా ఉంది. పురోహితుడు వేదమంత్రాలతో పెళ్లి జరిపిస్తున్నాడు కానీ, శాస్త్రోక్తంగా ఆయన చెప్పే మాటలను వరుడు (Groom) వినే పరిస్థితిలో లేడు. ఫుల్లుగా మద్యం (Liquor) సేవించిన అతడు.. మండపానికి వచ్చినప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మద్యం మత్తులో కారులోంచి తూలుతూ దిగిన పెళ్లి కొడుకు.. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు (Sleeping). అతడి తీరుతో వధువుకు చిర్రెత్తుకొచ్చి పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. విస్తుగొలిపే ఈ ఘటన అసోం (Assam)లోని నల్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నల్‌బరి పట్టణానికి చెందిన ప్రసేన్‌జీత్‌ హలోయ్‌ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహానికి కుటుంబసభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా కళ్యాణ వేదికకు వరుడు.. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వరుడిని చూసి వధువు పెళ్లికి నిరాకరించింది. అతడే కాదు, వరుడి తండ్రి సహా అతడి తరఫు వచ్చిన వారిలో 95 శాతం మంది బంధువులది ఇదే పరిస్థితి. అయితే, కుటుంబసభ్యులు తమ కుమార్తెను ఒప్పించడంతో ఆమె పెళ్లి పీటలపై కూర్చుంది.

వరుడు మద్యం మత్తులో తూగుతూనే ఆమె పక్కన కూర్చున్నాడు. పురోహితుడు చెప్పే మాటలను కూడా వినే పరిస్థితుల్లో లేని అతడు.. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. పెద్దలు చెప్పడంతో అప్పటి వరకూ సహనంతో ఉన్న వధువు.. అతడి తీరుతో విసిగిపోయింది. దీంతో కోపంతో పెళ్లిపీటల నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడ్ని పెళ్లిచేసుకుంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధమైపోయిందని వధువు వ్యాఖ్యానించింది.

‘‘పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది.. శాస్త్రోక్తంగా పండితుడు అన్ని చేయిస్తున్నాడు.. వివాహం కోసం మా కుటుంబం వీలైనంత మేర భారీ ఏర్పాట్లు చేసింది.. కానీ, వరుడి ప్రవర్తనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వధువు పెళ్లిపీటల మీద నుంచి దిగిపోయింది.. దీంతో అక్కడ గందరగోళం నెలకుంది... ’’ అని వధువు బంధువు ఒకరు తెలిపారు. పెళ్లి కొడుకు ప్రవర్తనపై వధువు తరఫు బంధువులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. అలాగే, నల్‌బరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు పరిహారం చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.