యాప్నగరం

పెళ్లిలో ఊడిన వరుడి విగ్గు... వివాహం వద్దని వెళ్లిపోయిన వధువు

మన దేశంలో పెళ్లిళ్లే హాట్ టాపిక్‌గా మారిపోతున్నాయి. పెళ్లి పీటల వరకూ వచ్చిన వివాహాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. ఒక దగ్గర వరుడి ఆలస్యంగా రావడం వల్ల పెళ్లి కొడుకే మారిపోయాడు. తాజాగా యూపీలో పెళ్లి కొడుకు బట్టతల విషయం బయటపడడంతో.. పెళ్లి ఆగిపోయింది. పైగా మోసం చేశారని వారిపై వధువు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. తర్వాత వధువు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో కుటుంబ సభ్యులు పెళ్లి రద్దు చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 23 May 2022, 5:53 pm

ప్రధానాంశాలు:

  • యూపీలోని ఉన్నావ్‌లో ఆగిపోయిన పెళ్లి
  • వరుడి బట్టతల బయటపడడంతో వధువు షాక్
  • చెదిరిపోయిన వరుడి పెళ్లి కల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మకచిత్రం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పెళ్లి పీటలపై అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. పెళ్లిపీటలపై కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు విగ్గు ఊడిపోయింది. దాంతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. వరుడి విగ్గును చూసి... వధువు షాక్ అవ్వడమే కాదు. పెళ్లి చేసుకోనని చెప్పి అందరూ అవాక్కయ్యే నిర్ణయం తీసుకుంది. నిజం బయటపడడంతో వధువు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేశారు. దాంతో వరుడి పెళ్లి కల చెదిరిపోయింది.
వరుడు పెళ్లి మండపంలోకి వెళ్లే సమయంలో తల తిరగడంతో స్పృహ తప్పి పడిపోయాడు. కింద పడిపోవడంతో పెళ్లి కూతురు సోదరుడు అతడిని లేపేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని తలపాగా తొలగించడంతో విగ్గు ఊడిపోయింది. దాంతో అందరూ షాకయ్యారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. పైగా బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పేసింది. పెళ్లి మండపానికి వెళ్లేందుకు నిరాకరించింది. ఎంతమంది నచ్చజెప్పినా ఆమె వినలేదు. తమ నిజం దాచి మోసం చేశారని పెళ్లి కూతురు బందువులు ఆరోపించారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పంచాయితీ నిర్వహించి పెళ్లికి రూ.5.66 లక్షలు ఖర్చు చేసినట్టు వధువు కుటుంబీకులు తెలిపారు. వరుడి తరపు వారు వారి డిమాండ్‌కు అంగీకరించి, వధువు తండ్రికి డబ్బును తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. తర్వాత వరుడు అతని కుటుంబ సభ్యులు పెళ్లి జరగక్కుండానే వెనుదిరిగినట్టు తెలుస్తుంది. వరుడికి బట్టతల ఉన్న విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులు దాచిపెట్టకుండా ఉండాల్సిందని పెళ్లికూతురు మేనమామ అన్నారు. అబద్ధాలతో వివాహం జరగదని ఆయన అన్నారు.

కాగా గత నెల కూడా పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. అక్కడ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని మల్కాపూర్ పంగ్రాలో ఏప్రిల్ 22న సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన పెళ్లి కాస్తా ఆగిపోయింది. కల్యాణ మండపానికి ముహూర్తానికి రావాల్సిన వరుడు... నాలుగు గంటలు ఆలస్యంగా వెళ్లాడు. దాంతో వివాహం ఆగిపోయింది. ఫ్రెండ్స్‌తో తాగి, డ్యాన్స్‌లు వేసుకుంటూ 4 గంటల ఆలస్యంగా మండపానికి వెళ్లాడు. దాంతో వధువు తల్లిదండ్రులు అక్కడే వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసేశారు.

Read also: భార్య కోసం రూ.90,000లతో మోపెడ్ కొన్న బిచ్చగాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.