అచ్చం సినిమాలో మాదిరిగా ఓ వైద్య విద్యార్థినికి మిస్డ్ కాల్ ద్వారా ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరువురూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. దీంతో నాలుగేళ్ల పాటు నిరీక్షించి, చివరకు తల్లిదండ్రులను ఒప్పించింది. కుమార్తె పెళ్లికి సమ్మతించిన పెద్దలు ప్రేమించిన యువకుడితో నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. అయితే, చివరి నిమిషంలో వరుడు కుటుంబ సభ్యులు కాదన్నారు. మనస్పర్థలను పెళ్లికి అడ్డు చెప్పడంతో ఆ యువతి వరుడి ఇంటి ముందు ధర్నా చేసింది.
ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి (Kanniyakumari) జిల్లా పడందాలుమూడు అనే గ్రామంలో చోటుచేసుకుంది. పడందాలుమూడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఇంజనీరింగ్ యువకుడు కేరళలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఫోన్కు నాలుగేళ్ల కిందట మిస్డ్ కాల్ వచ్చింది. ఇది నాగర్కోయిల్కు చెందిన వైద్య విద్యార్థిని మొబైల్ నుంచి రాగా.. తర్వాత ఈ కాల్ వారి మధ్య పరిచయానికి వారధిగా నిలిచింది. తరుచూ ఇరువురూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టం ప్రేమగా మారడంతో నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.
ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ముందు ప్రేమను అంగీకరించలేదు. తర్వాత కుమార్తె ఇష్టాన్ని కాదనలేకపోయారు. అబ్బాయి కుటుంబం కూడా సమ్మతించడంతో నిశ్చితార్థం కూడా కానిచ్చేశారు. సెప్టెంబరు 12న వీరి వివాహానికి ముహూర్తం పెట్టారు వివాహ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. కానీ, ఇంతలో ఇరు కుటుంబాల పెద్దల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వివాహం (marriage) ఆగిపోయింది. దీంతో వరుడి ఇంటి ముందు వధువు ధర్నాకు దిగింది. పోలీసులకు అక్కడకు చేరుకుని న్యాయం జరిగేలా చేస్తామని యువతికి నచ్చజెప్పారు.
ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి (Kanniyakumari) జిల్లా పడందాలుమూడు అనే గ్రామంలో చోటుచేసుకుంది. పడందాలుమూడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఇంజనీరింగ్ యువకుడు కేరళలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఫోన్కు నాలుగేళ్ల కిందట మిస్డ్ కాల్ వచ్చింది. ఇది నాగర్కోయిల్కు చెందిన వైద్య విద్యార్థిని మొబైల్ నుంచి రాగా.. తర్వాత ఈ కాల్ వారి మధ్య పరిచయానికి వారధిగా నిలిచింది. తరుచూ ఇరువురూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టం ప్రేమగా మారడంతో నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.
ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ముందు ప్రేమను అంగీకరించలేదు. తర్వాత కుమార్తె ఇష్టాన్ని కాదనలేకపోయారు. అబ్బాయి కుటుంబం కూడా సమ్మతించడంతో నిశ్చితార్థం కూడా కానిచ్చేశారు. సెప్టెంబరు 12న వీరి వివాహానికి ముహూర్తం పెట్టారు వివాహ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. కానీ, ఇంతలో ఇరు కుటుంబాల పెద్దల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వివాహం (marriage) ఆగిపోయింది. దీంతో వరుడి ఇంటి ముందు వధువు ధర్నాకు దిగింది. పోలీసులకు అక్కడకు చేరుకుని న్యాయం జరిగేలా చేస్తామని యువతికి నచ్చజెప్పారు.