యాప్నగరం

kohinoor Diamond: కోహినూర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భారత్.. బ్రిటన్ మీడియా నివేదికల్లో నిజమెంత?

kohinoor Diamond కోహినూర్ వజ్రం మనదే.. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప, మనది అని చూపించుకోవడానికి ప్రస్తుతం మన అధీనంలో లేదు. కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి అత్యంత విలువైన కోహినూర్‌ను దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది. దీనిపై అధికార వర్గాలు స్పందించాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 15 May 2023, 10:44 am

ప్రధానాంశాలు:

  • చివరిసారిగా మహారాజా రంజిత్ సింగ్ ఖజానాలో కోహినూర్
  • విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చిన ఈస్టిండియా కంపెనీ
  • వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తోన్న భారతీయులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కోహినూర్ వజ్రం
బ్రిటన్‌లోని మ్యూజియంల నుంచి కోహినూర్ వజ్రం (Kohinoor Diamond), పురాతన విగ్రహాలు (Idol), శిల్పాలతో సహా ఇతర కళాఖండాలను (Artefacts) తిరిగి తీసుకొచ్చేందుకు దౌత్య మార్గాలను భారత్ సమీకరించినట్లు బ్రిటిష్ మీడియాలో (British Media) వచ్చిన కథనాలను అధికార వర్గాలు ఖండించాయి. యూకే నుంచి వేలాది కళాఖండాలను తిరిగి పొందేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, దౌత్య సిబ్బంది సమీకరిస్తున్నారనేది నిజం కాదని ఆ వర్గాలు తెలిపాయి. నివేదికలను ఉదహరించిన వర్గాలు.. కోహినూర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని పేర్కొన్నాయి.
ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సంబంధాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సహకారం, భాగస్వామ్యం ద్వారా పురాతన వస్తువులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించినట్టు వివరించాయి. ఈ ప్రక్రియ గతంలో కూడా అలాగే భారతీయ కళాఖండాలు ఉన్న అనేక దేశాలలో జరుగుతోంది. గతవారం కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక సమయంలో రాణి కెమిల్లా కిరీటంలో ప్రత్యామ్నాయ వజ్రాలను ఎంచుకున్నప్పటికీ కోహినూర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

105 క్యారెట్ల ఈ అరుదైన వజ్రాన్ని పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ఖజానా నుంచి ఈస్టిండియా కంపెనీ చేజిక్కించుకుంది. అంతకు ముందు అనేక మంది పాలకుల చేతుల మారింది. పంజాబ్ విలీనమైన తరువాత క్వీన్ విక్టోరియాకు ఈ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు.

డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తన నివేదికలో కోహినూర్‌ను తిరిగి తీసుకురావడం భారత ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి అని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో తమకు చెందిన కళాఖండాలను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రీస్ ఎల్గిన్ మార్బుల్స్, నైజీరియా బెనిన్ కాంస్యాలను కోరింది. స్కాటిష్ నగరంలోని మ్యూజియంలను నిర్వహించే గ్లాస్గో లైఫ్ స్వచ్ఛంద సంస్థ చోరీకి గురైన ఏడు కళాఖండాలను భారతదేశానికి తిరిగి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వస్తువులు చాలా వరకు 19వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల నుంచి దొంగిలించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.