యాప్నగరం

ఉగ్రవాదుల కుట్ర.. సరిహద్దులో మరో సొరంగం

Pakistan Terrorists: సరిహద్దు వెంట ఉగ్రవాదులు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. కశ్మీర్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ దళాలు మరో సొరంగాన్ని గుర్తించారు. 6 నెలల్లో ఇది నాలుగో సొరంగం కావడం గమనార్హం.

Samayam Telugu 23 Jan 2021, 7:47 pm
రిహద్దు వెంట పాక్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు పన్నాగాలు చేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో రహస్య సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. తాజాగా కథువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ అధికారులు మరో సొరంగాన్ని కనుగొన్నారు. 10 రోజుల వ్యవధిలో బీఎస్‌ఎఫ్‌ అధికారులు కనుగొన్న రెండో సొరంగం ఇది. అంతేకాదు, గత 6 నెలల వ్యవధిలో ఇది నాలుగో రహస్య సొరంగ మార్గం కావడం గమనార్హం.
Samayam Telugu కశ్మీర్ సొరంగం
Terrorists Tunnel in Kashmir


భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది చేపట్టిన యాంటీ టన్నెల్‌ ఆపరేషన్‌లో భాగంగా రహస్య సొరంగాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టార్‌ పన్సార్‌ అవుట్పోస్ట్‌ ప్రాంతంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

బీఎస్‌ఎఫ్ గుర్తించిన ఉగ్రవాదుల సొరంగం ఇదే..

ఈ సొరంగం పొడవు దాదాపు 150 మీటర్లు ఉందని, 30 అడుగుల లోతు ఉంటుందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. జనవరి 13న హీరానగర్ సెక్టార్‌లోని బోబియాన్‌ గ్రామంలో 150 మీటర్ల పొడవున్న సొరంగాన్ని కనుగొన్నారు.

Also Read: ఏనుగు చెవికి నిప్పుపెట్టిన యువకులు.. గాయంతో విలవిల్లాడి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.