తేజ్ బహదూర్ యాదవ్... ఈ ఏడాది మొదట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన జవాను. బీఎస్ఎఫ్ జవానులకు పెట్టే ఆహారం నాసిరకంగా ఉంటోందని వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇది వైరల్ అయి... కొన్ని వేల మంది షేర్ చేశారు. ఆర్మీలో ఈ వీడియో సంచలనంగా మారింది. ఆ జవానును నేడు ఆర్మీ విధుల నుంచి తొలగించింది. బీఎస్ఎఫ్ లో ఉన్న నియమాలను బట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఆర్మీ తెలిపింది. తేజ్ బహదూర్ యాదవ్ పెట్టిన పోస్టులపై ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ఆ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను, బీఎస్ఎఫ్ ను ఆదేశించింది. అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిల్ దాఖలైంది. ఆ పిటిషన్లో జవానులకు పెట్టే ఆహారాన్ని ఉన్నతాధికారులు రోజూ పర్యవేక్షించాలని కోరారు పిటిషన్ దారులు.
ఆ పిటిషన్ పై హైకోర్టు స్పందించిన పారామిలటరీ దళాలకు నోటీసులు జారీ చేసింది. జవానులకు నాసిరకం ఆహారం పెడుతున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అలాగే జవాను వీడియో వైరల్ అయ్యాక బీఎస్ఎఫ్ చేపట్టిన చర్యల గురించి కూడా ప్రశ్నించింది. తేజ్ బహదూర్ తీసిన వీడియోలు పెద్ద ప్రకంపనలనే సృష్టించాయి.
అయితే విధి నిర్వహణలో ఉన్న జవాను ఫోన్ వాడడం నిషేధం. ముఖ్యంగా పహారా కాస్తున్న ప్రాంతంలో వీడియోలు తీయకూడదు. కానీ తేజ్ బహదూర్ అలా వీడియోలు తీయడంపైనా పలువురు ఉన్నతాధికారులు గతంలోనే సీరియస్ అయ్యారు.
ఆ పిటిషన్ పై హైకోర్టు స్పందించిన పారామిలటరీ దళాలకు నోటీసులు జారీ చేసింది. జవానులకు నాసిరకం ఆహారం పెడుతున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అలాగే జవాను వీడియో వైరల్ అయ్యాక బీఎస్ఎఫ్ చేపట్టిన చర్యల గురించి కూడా ప్రశ్నించింది. తేజ్ బహదూర్ తీసిన వీడియోలు పెద్ద ప్రకంపనలనే సృష్టించాయి.
అయితే విధి నిర్వహణలో ఉన్న జవాను ఫోన్ వాడడం నిషేధం. ముఖ్యంగా పహారా కాస్తున్న ప్రాంతంలో వీడియోలు తీయకూడదు. కానీ తేజ్ బహదూర్ అలా వీడియోలు తీయడంపైనా పలువురు ఉన్నతాధికారులు గతంలోనే సీరియస్ అయ్యారు.