యాప్నగరం

ఆ జవాన్ వీడియోపై ఐఎస్ఐ దుష్ప్రచారం

బీఎస్ఎఫ్ జవాన్లకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, వంటశాలలను సందర్శించి వాటి నాణ్యతను ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చని పారా మిలటరీ దళాల చీఫ్ కేకే శర్మ పేర్కొన్నారు

TNN 27 Aug 2017, 2:55 pm
బీఎస్ఎఫ్ జవాన్లకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, వంటశాలలను సందర్శించి వాటి నాణ్యతను ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చని పారా మిలటరీ దళాల చీఫ్ కేకే శర్మ పేర్కొన్నారు. దీనిపై పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తప్పుడు ప్రచారం సాగిస్తూ, సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. బీఎస్ఎఫ్ అదనపు డిప్యూటీ జనరల్‌గా 2012లో చేరానని... ఇంతవరకు ఆహరం విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని శర్మ అన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో సమస్యలు ఉండవచ్చు.... సరైన ఆహారం అందించడం లేదంటూ వీడియోలను పోస్ట్ చేయడం షాక్‌కు గురించేసిందని పరోక్షగంగా తేజ్ బహుదూర్ యాదవ్ వీడియోపై ప్రస్తావించారు. సైన్యం ఆరోగ్యం విషయంలో శక్తివంతమైన వ్యవస్థ కలిగి ఉంది... వారికి అందించే ఆహరం తయారు చేసే వంటగదులపై నిరంతక పర్యవేక్షణ ఉంటుందని... ఇది సమస్యే కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీజీ శర్మ అన్నారు.
Samayam Telugu bsf jawans video used by isi to spread wrong message
ఆ జవాన్ వీడియోపై ఐఎస్ఐ దుష్ప్రచారం


సైన్యానికి నాణ్యమైన ఆహరం విషయంలో నేను గ్యారంటీ ఇవ్వగలను... దీనిపై ఎవరితోనైనా, ఏ సమయంలోనైనా సవాల్‌‌కు సిద్ధమేనని ప్రకటించారు. బీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న 2.65 లక్షల మంది సైన్యానికి హోమ్లీ ఆహారాన్ని సరిపడినంతగా అందిస్తున్నామని శర్మ అన్నారు. ఇదే అంశంపై ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో సభ్యుల మధ్య జరిగిన చర్చలో కొన్ని సూచనలు చేశారని అన్నారు. తమకు అందించే ఆహారంపై ఓ వీడియోను బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై విచారణ జరిపించి ఆయన ఆరోపణలు తప్పని రుజువు కావడంతో విధులు నుంచి తొలగించారు... ఇది ఐఎస్ఐ కుట్రగా ఆయన అభివర్ణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.