యాప్నగరం

ఎవరెస్ట్ అధిరోహణ.. బీఎస్ఎఫ్ ఆఫీసర్ అరుదైన రికార్డ్

బీఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ లవ్‌రాజ్ ధర్మశక్తు అనితర సాధ్యంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఏడు సార్లు అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించారు.

Samayam Telugu 21 May 2018, 1:53 pm
బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ లవ్‌రాజ్ సింగ్ ధర్మశక్తు ఏడోసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ పితోర్‌ఘడ్‌లోని బోనా గ్రామానికి చెందిన లవ్‌రాజ్ ఆదివారం ఉదయం బీఎస్ఎఫ్ టీంతో కలిసి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత అయిన ధర్మశక్తు.. గత ఏడాది మే 27 ఎవరెస్ట్ ఎక్కారు. తద్వారా ప్రపంచంలో ఎత్తయిన పర్వతాన్ని ఆరుసార్లు అధిరోహించిన తొలి భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పారు. ఆదివారం మళ్లీ అధిరోహించడం ద్వారా తన రికార్డును మెరుగుపర్చుకున్నారు.
Samayam Telugu Loveraj Singh Dharamshaktu3


ఆదివారం ఉదయం ఏడుగురు సభ్యులం కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామని ధర్మశక్తు శాటిలైట్ ఫోన్ ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. సోమవారం మధ్యాహ్ననికి తిరిగి బేస్ క్యాంపు చేరుకుంటామని ఆయన చెప్పారు. 1998లో తొలిసారి ఎవరెస్ట్ ఎక్కిన ఆయన 2006, 2009, 2012, 2013, 2016లోనూ ఈ శిఖరాన్ని అధిరోహించారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ధర్మశక్తును ప్రధాని అభినందించారు. ధర్మశక్తు ఆధ్వర్యంలో 25 మంది సభ్యులు ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. ఏడుగురు సభ్యులకు ఆయన నేతృత్వం వహించగా.. డిప్యూటీ కమాండెంట్ అవినాష్ నేగి నేతృత్వంలోని రెండో టీం కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తోంది.

తమ టీం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోంచడం ఆనందంగా ఉందని బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై ఇతర పర్వతారోహకులు పడేసిన చెత్తను లవ్‌రాజ్ టీం బేస్ క్యాంప్‌కి తీసుకురానుంది. క్లీన్ గంగ, క్లీన్ హిమాలయ కోసం ధర్మశక్తు ప్రచారం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.