సరిహద్దులు కాపాడాల్సిన బీఎస్ఎఫ్ అధికారులు సైడ్ బిజినెస్ చేస్తున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని వారిని ప్రభుత్వం కంటిపాపలా చూసుకుంటుంటే..వారు మాత్రం..‘రేషన్’ దందాలో మునిగిపోయారు.
శ్రీనగర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు బీఎస్ఎఫ్ ఆఫీసర్లు జవాన్లకు అందుతున్న ఆహార పదార్ధాలు, డీజిల్, పెట్రోలులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టాప్ రేంజ్ అధాకారులు కూరగాయలు, పప్పు ధాన్యాలు, డీజిల్, పెట్రోలు వంటిని తక్కువ ధరకు సరిహద్దు ప్రాంతాల ప్రజలు, చిల్లర వర్తకం దారులకు అమ్ముతూ..సాటి జవాన్ల పొట్ట కొడుతున్నారు.
శ్రీనగర్ ఎయిర్ పోర్టు సమీపంలోని హమ్ హమా బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి అధికారులు స్థానిక దుకాణందార్లకు ఆహార పదార్ధాలు, డీజిల్ పెట్రోలు అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని స్థానికులు, జవాన్లు బట్టబయలు చేశారు.
తమకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాన్ వీడియో సంచలనం సృష్టించిన నేపథ్యలో మిగతా సైనికులు ఒక్కొక్కరిగా పెదవి విప్పుతున్నారు.
‘‘మాకు అందే ఆహార పదార్థాలైన ఉప్పులు, పప్పులు, కూరగాయలు, డీజిల్, పెట్రోలును సగం ధరకే అమ్ముతున్నారు. రోజు వారీగా అందే ఇతర వస్తువులను కూడా మాకు అందించడం లేదు. పైఅధికారులు వీటిని అమ్మేందుకు ఏజెంట్లను నియమించుకున్నారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జవాను చెప్పాడు.
అటు స్థానికులు కూడా తాము బీఎస్ఎఫ్ నుంచి పెట్రోలు, డీజిల్ సహా ఇతర వస్తువులు తక్కువ రేటుకే పొందుతామని చెబుతున్నారు.
‘‘హమ్ హమా క్యాంపు నుంచి మేం డీజిల్, పెట్రోలు, బియ్యం, మిరప పొడి వంటి సగం ధరకే పొందుతున్నాం’’ అని స్థానికులు అంటున్నారు.
తమ అవసరాల కోసం అంటూ పర్నీచర్ ను సైతం కొనుగోలు చేసి..కమీషన్ కు బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.
ఈ దందాలో చేతివాటం, అక్రమాలకు పాల్పడేది బీఎస్ఎఫ్ అధికారులు మాత్రమే కాదు సీఆర్పీఎఫ్ అధికారులు ఇలాగే చేస్తారని శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ ఐజీ రవీందర్ సింగ్ సాహీ అంటున్నారు.
అధికారులు జవాన్లకు అందాల్సిన వస్తువులు, ఆహారపదార్థాలు అమ్ముకుంటున్నారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జవాన్ల సంక్షేమమే తకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
అయితే బీఎస్ఎఫ్ ఇ-టెంటర్ సిస్టమ్ లేదు. సీఆర్పీఎఫ్ లో ప్రతి వస్తువుకు కచ్చితమైన లెక్క చెప్పాలని అధికారులు అంటున్నారు.
‘‘మేం క్వాలిటీ ఫుడ్ పొందుతున్నాం. విధులు ముగిసిన తర్వాత అనువైన వసతులే పొందుతున్నామని’’ ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చెప్పాడు.
మరోవైపు తేజ్ బహదూర్ యాదవ్ చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
శ్రీనగర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు బీఎస్ఎఫ్ ఆఫీసర్లు జవాన్లకు అందుతున్న ఆహార పదార్ధాలు, డీజిల్, పెట్రోలులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టాప్ రేంజ్ అధాకారులు కూరగాయలు, పప్పు ధాన్యాలు, డీజిల్, పెట్రోలు వంటిని తక్కువ ధరకు సరిహద్దు ప్రాంతాల ప్రజలు, చిల్లర వర్తకం దారులకు అమ్ముతూ..సాటి జవాన్ల పొట్ట కొడుతున్నారు.
శ్రీనగర్ ఎయిర్ పోర్టు సమీపంలోని హమ్ హమా బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి అధికారులు స్థానిక దుకాణందార్లకు ఆహార పదార్ధాలు, డీజిల్ పెట్రోలు అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని స్థానికులు, జవాన్లు బట్టబయలు చేశారు.
తమకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాన్ వీడియో సంచలనం సృష్టించిన నేపథ్యలో మిగతా సైనికులు ఒక్కొక్కరిగా పెదవి విప్పుతున్నారు.
‘‘మాకు అందే ఆహార పదార్థాలైన ఉప్పులు, పప్పులు, కూరగాయలు, డీజిల్, పెట్రోలును సగం ధరకే అమ్ముతున్నారు. రోజు వారీగా అందే ఇతర వస్తువులను కూడా మాకు అందించడం లేదు. పైఅధికారులు వీటిని అమ్మేందుకు ఏజెంట్లను నియమించుకున్నారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జవాను చెప్పాడు.
అటు స్థానికులు కూడా తాము బీఎస్ఎఫ్ నుంచి పెట్రోలు, డీజిల్ సహా ఇతర వస్తువులు తక్కువ రేటుకే పొందుతామని చెబుతున్నారు.
‘‘హమ్ హమా క్యాంపు నుంచి మేం డీజిల్, పెట్రోలు, బియ్యం, మిరప పొడి వంటి సగం ధరకే పొందుతున్నాం’’ అని స్థానికులు అంటున్నారు.
తమ అవసరాల కోసం అంటూ పర్నీచర్ ను సైతం కొనుగోలు చేసి..కమీషన్ కు బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.
ఈ దందాలో చేతివాటం, అక్రమాలకు పాల్పడేది బీఎస్ఎఫ్ అధికారులు మాత్రమే కాదు సీఆర్పీఎఫ్ అధికారులు ఇలాగే చేస్తారని శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ ఐజీ రవీందర్ సింగ్ సాహీ అంటున్నారు.
అధికారులు జవాన్లకు అందాల్సిన వస్తువులు, ఆహారపదార్థాలు అమ్ముకుంటున్నారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జవాన్ల సంక్షేమమే తకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
అయితే బీఎస్ఎఫ్ ఇ-టెంటర్ సిస్టమ్ లేదు. సీఆర్పీఎఫ్ లో ప్రతి వస్తువుకు కచ్చితమైన లెక్క చెప్పాలని అధికారులు అంటున్నారు.
‘‘మేం క్వాలిటీ ఫుడ్ పొందుతున్నాం. విధులు ముగిసిన తర్వాత అనువైన వసతులే పొందుతున్నామని’’ ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చెప్పాడు.
మరోవైపు తేజ్ బహదూర్ యాదవ్ చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.