యాప్నగరం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం ముమ్మరం చేసింది. తాజాగా ఈ ఉదయం కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

TNN 12 Jul 2017, 11:34 am
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం ముమ్మరం చేసింది. తాజాగా ఈ ఉదయం కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్లు ఆర్మీ తెలిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించింది. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. బుద్గామ్ జిల్లా మగమ్‌లోని రాడ్‌బగ్ గ్రామంలో తీవ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న సైనికులు మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలోని అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించారని ఆర్మీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జవాన్ల సోదాలు కొనసాగుతుండగా నిర్వహిస్తుడంగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది.
Samayam Telugu budgam encounter 3 hizbul terrorists gunned down hunt on for more
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం


ఈ కాల్పుల్లో మరణించిన ముగ్గురు తీవ్రవాదులు హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరు చూరుపొరా నర్బాల్‌కు చెందిన జావేద్ షైక్, ముస్తఫాబాద్ జైనేకోట్‌కు చెందిన దావూద్ అహ్మద్ సోఫీ, అక్వీబ్ గుల్‌గా తెలిపారు. తప్పించుకున్న మరికొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. వీరి కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీస్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేట్టాయి. సోమవారం రాత్రి అమర్‌నాథ్ యాత్రికుల వాహనంపై తీవ్రవాదులు దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సైన్యం మరింత అప్రమత్తమైన తీవ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.