యాప్నగరం

దేశాన్ని కాంగ్రెస్ నుంచి కాపాడింది జనశక్తే!

లోక్ సభలో ప్రధాని మోడీ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీని తన దైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చారు.

TNN 7 Feb 2017, 1:34 pm
లోక్ సభలో ప్రధాని మోడీ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీని తన దైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపేందుకు మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూకంపం వస్తుందని కొందరు కొన్ని రోజులుగా బెదరిస్తున్నారు... ఎట్టకేలకు నిన్న ఉత్తర భారతదేశంలో భూకంపం వచ్చింది అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మోడీ అవినీతికి పాల్పడినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అవి బయటపెడితే భూకంపం వస్తుందని గత కొన్ని నెలలుగా మీడియా ముందు అంటున్నారు. దానికి లోక్ సభలో కౌంటర్ ఇచ్చారు మోడీ. అయితే భూకంపం మూలం ఎక్కడుందో కనుక్కోవాలని చమత్కరించారు.
Samayam Telugu budget session of parliament pm modi taunts rahul gandhi and congress party
దేశాన్ని కాంగ్రెస్ నుంచి కాపాడింది జనశక్తే!


అనంతరం ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. దేశాన్ని ఓ కుటుంబం చేతుల్లోంచి బయటికి తీసుకొచ్చిన శక్తి జనశక్తేనని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడంటే ఆ ఘనత ప్రజలదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి ముందు 1857లో సిపాయిల తిరుగు బాటు జరిగిందని గుర్తు చేశారు. ఆ సిపాయిల తిరుగుబాటుకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పకుంటుందా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలను ఒక్క తాటిపై నిలిపిన ఎంతో మంది మహానుభావుల కృషి ఫలితమే ఈ దేశ స్వాతంత్ర్యమని ఆయన అన్నారు.

బడ్జెట్ నెల రోజుల ముందే ఎందుకు ప్రవేశపెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులకు ముందుగానే తగినంత సహకారం అందించాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టినంటూ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.