యాప్నగరం

అమెరికాలో దాడులపై వివరణ ఇస్తాం: రాజ్‌నాథ్

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై వచ్చేవారం వివరణ ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో చెప్పారు.

TNN 9 Mar 2017, 12:02 pm
కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అధికార, విపక్ష పార్టీల ఎంపీలంతా ఈ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభానికి ముందు ఇటీవల కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి పి.శివశంకర్‌కు ఉభయసభలు సంతాపం తెలిపాయి.
Samayam Telugu budget session rajya sabha adjourned for the day
అమెరికాలో దాడులపై వివరణ ఇస్తాం: రాజ్‌నాథ్


ఆ తరవాత ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో భారతీయులపై దాడులకు కేంద్రం వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అమెరికాలో భారతీయులపై దాడులు విచారకరమని అన్నారు. ఈ దాడులపై వచ్చేవారం వివరణ ఇస్తామని చెప్పారు. అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ కొనసాగుతోంది.

ప్రధాని మోదీ లోక్‌సభకు హాజరయ్యారు. ఆరోగ్య భద్రత వ్యయంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. అయితే అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నారు. కాగా, మెటర్నటీ సెలవులను ప్రస్తుతమున్న 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన ‘మెటర్నటీ బెన్‌ఫిట్స్(సవరణ) బిల్లు-2016’ను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు గతేడాది ఆగస్టులోనే రాజ్యసభ ఆమోదం పొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.