యాప్నగరం

ఢిల్లీ: నెల వ్యవధిలో మూడో అగ్ని ప్రమాదం.. మంటలకు కుప్పకూలిన భవనం

నెల రోజుల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీలో మూడు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 44 మందిని పొట్టనబెట్టుకున్న డిసెంబరు 9నాటి ఘటన మరిచిపోకముందే డిసెంబరు 23న మరో ప్రమాదం సంభవించింది.

Samayam Telugu 2 Jan 2020, 12:16 pm
రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం పీరాగర్హి ప్రాంతంలో బ్యాటరీలు తయారుచేసే ఫ్యాక్టరీలు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అగ్ని మాపక సిబ్బంది సహా 14 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్భందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఏడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో అదనంగా మరో 28 ఫైర్ ఇంజిన్లను రప్పించారు. మంటలను అర్పుతుండగా ఈ సమయంలో భవనం వెనుక భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఫైర్ సిబ్బంది కూడా అందులో చిక్కుకున్నారు.
Samayam Telugu building collapses after fire in delhis peeragarhi all trapped people rescued
ఢిల్లీ: నెల వ్యవధిలో మూడో అగ్ని ప్రమాదం.. మంటలకు కుప్పకూలిన భవనం


అతికష్టంతో మంటలను అదుపుచేసిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాక సిబ్బంది.. క్షతగాత్రులను బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన 14 మందిని సంజయ్ గాంధీ హాస్పిటల్, బాలాజీ యాక్షన్ హాస్పిటల్స్‌లో చేర్పించారు. ముందస్తు జాగ్రత్తగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. అగ్నిమాపక, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

వరుస అగ్ని ప్రమాదాలతో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే మూడు భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డిసెంబరు 8న ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారు. అలాగే, డిసెంబరు 23న కిరారీ ప్రాంతంలో మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.