యాప్నగరం

లోయలో పడ్డ బస్సు: 22 మంది మృతి

జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.

TNN 20 Oct 2016, 8:14 pm
జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. కొండల ప్రాంతంలో నిండా ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర గంటల మధ్యలో జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది అక్కడికక్కడే మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్టు జమ్మూ కాశ్మీర్ మంత్రి అజయ్ నందా తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu bus accident in jammu and kashmir 22 killed
లోయలో పడ్డ బస్సు: 22 మంది మృతి

22 people have died, injured persons being shifted in ambulances: Ajay Nanda, J&K Minister on Reasi bus incident. pic.twitter.com/bcBO7PKm0m — ANI (@ANI_news) October 20, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.