జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. కొండల ప్రాంతంలో నిండా ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర గంటల మధ్యలో జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది అక్కడికక్కడే మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్టు జమ్మూ కాశ్మీర్ మంత్రి అజయ్ నందా తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
22 people have died, injured persons being shifted in ambulances: Ajay Nanda, J&K Minister on Reasi bus incident. pic.twitter.com/bcBO7PKm0m — ANI (@ANI_news) October 20, 2016
22 people have died, injured persons being shifted in ambulances: Ajay Nanda, J&K Minister on Reasi bus incident. pic.twitter.com/bcBO7PKm0m — ANI (@ANI_news) October 20, 2016