యాప్నగరం

Poonch Bus Accident: లోయలో పడిన బస్సు.. 11 మంది దుర్మరణం

ప్రమాద స్థలం పూంచ్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు పూంచ్ నుంచి లోరన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 8 Dec 2018, 12:10 pm
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫూంచ్ జిల్లాలోని పలేరా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ప్రమాద స్థలం పూంచ్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు పూంచ్ నుంచి లోరన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu accident


ప్రమాద సమాచారం తెలియగానే స్థానిక పోలీసులతో పాటు సహాయ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో జమ్మూకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.