యాప్నగరం

లోయలో పడిన బస్సు 25 మంది దుర్మరణం.. 35 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడటంతో 25 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా, 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన కులు జిల్లాలో చోటు చేసుకుంది.

Samayam Telugu 20 Jun 2019, 7:49 pm
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిన ఘటనలో 25 మంది చనిపోగా.. 35 మంది గాయపడ్డారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. 12 మంది మహిళలు, 10 మంది పురుషులు, 10 మంది చిన్నారులను కాపాడామని కులు ఎస్పీ శాలినీ అగ్నిహోత్రి తెలిపారు.
Samayam Telugu హిమాచల్ బస్సు ప్రమాదం


HP66-7065 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బస్సు.. 60 మంది ప్రయాణికులతో కులు-గడగుషైనీ రూట్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంజర్ బస్టాండ్ నుంచి బయల్దేరిన బస్సు 2 కి.మీ. ప్రయాణించగానే.. మలుపు వద్ద లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రత కారణంగా బస్సు పై భాగం పూర్తిగా ధ్వంసమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.