యాప్నగరం

లోయలో పడిన బస్సు: 21మంది దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.

TNN 24 May 2017, 9:41 am
ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీలోని దరసు ప్రాంతంలో ఉన్న లోయలో బస్సు పడిపోయింది. 250 మీటర్ల లోతులో ఉన్న నదిలో బస్సు పడిపోవడంతో... 21 మంది మరణించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. లోయలో పారుతున్న భాగిరథి నదిలో ప్రయాణికులను వెతికేందుకు గజఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఘటన జరిగే సమయానికి బస్సులో 28 మంది యాత్రికులు ఉన్నారు. ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తం రెండు బస్సుల్లో 57 మంది యాత్రికులు ఉత్తర కాశీనుంచి గంగోత్రి వెళుతున్నారు. అందులోని ఒక బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు టైరు ఊడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. యాత్రికులంతా మధ్యప్రదేశ్ చెందినవారు.
Samayam Telugu bus falls into gorge in uttarkashi 21 feared dead
లోయలో పడిన బస్సు: 21మంది దుర్మరణం


ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సీఎం మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయాల పరిహారం ప్రకటించగా, ఉత్తరాఖండ్ సీఎం మృతుల కుటుంబాలకు లక్ష పరిహారం, గాయపడిన వారికి యాభై వేల రూపాయల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.