యాప్నగరం

కాసేపట్లో పెళ్లి... ఇంతలోనే విషాదం

మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. అనుకోని ప్రమాదంతో పెళ్లి కొడుకు చనిపోయాడు. కన్నీళ్లు తెప్పిస్తున్న విషాదం

TNN 19 Feb 2018, 2:07 pm
ఆ ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. బంధువులతో కళకళలాడుతోంది. మరికొద్దిగంట్లలోనే వివాహ వేడుక. ఇంతలోనే అనుకొని విషాదం... పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు విగతజీవిగా మారిపోయాడు. భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో... చావు డప్పు మోగింది. యూపీలోని నోయిడాలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నందోసి ప్రాంతానికి చెందిన నరేష్ పాల్ గాంగ్వర్ సివిల్ ఇంజినీర్. నోయిడాలోని సుఖిజా బిల్డర్స్‌లో పనిచేస్తున్న నరేష్‌కు షాజహాన్‌పూర్‌కు చెంది యువతితో పెళ్లి కుదిరింది. ఆదివారం సాయంత్రం పెళ్లి ముహూర్తం. మరి కొన్ని గంటల్లో పెళ్లి ముహూర్తం... ఈలోపే నరేష్‌కు ఫోన్ కాల్ వచ్చింది.
Samayam Telugu busy on phone engineer run over by train on his wedding day
కాసేపట్లో పెళ్లి... ఇంతలోనే విషాదం



ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సిగ్నల్ సరిగా లేకపోవడంతో పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ హడావిడిలో ట్రాక్‌పై ట్రైన్ వస్తున్న విషయాన్ని గమనించలేదు. ఇంతలోపే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ అతడ్ని ఢీకొట్టింది. స్పాట్‌లోనే నరేష్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతితో పెళ్లి ఇంట విషాదం నెలకొనగా... తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోయాడంటూ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లి కోసమని వచ్చి ఇలా అంత్యక్రియల్లో పాల్గొనడం బాధగా ఉందని నరేష్ మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.