యాప్నగరం

2030కి దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకం బంద్!

దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్‌తో నడిపే కార్ల అమ్మకానికి స్వస్థి పలకాలని, వాటి స్థానంలో విద్యుత్ సాయంతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.

TNN 30 Apr 2017, 5:45 pm
దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్‌తో నడిపే కార్ల అమ్మకానికి స్వస్థి పలకాలని, వాటి స్థానంలో విద్యుత్ సాయంతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. చమురు దిగుమతి, వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గించడమే లక్ష్యం దిశగా ఈ అడుగులు వేస్తోంది. విద్యుత్ సాయంతో నడిచే వాహనాలను భారీ మొత్తంలో పరిచయం చేస్తున్నాం... ఉజల్ పథకం కింద ఈ వాహనాలు స్వయంగా తయారు చేస్తాం... 2030 నాటికి డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్ల అమ్మకాన్ని పూర్తిగా నిలుపుదల చేస్తామని సీఐఐ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఒక స్థిరత్వం వచ్చేవరకు ప్రభుత్వమే ఈ వాహనాల తయారీ పరిశ్రమలను రెండు నుంచి మూడేళ్లు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
Samayam Telugu by 2030 not a single petrol or diesel car should be sold in india
2030కి దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకం బంద్!


ప్రారంభంలో మారుతి కార్ల నిర్మాణానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, ప్రస్తుతం ఇది దేశంలోనే పెద్ద ఆటోమోటివ్ పరిశ్రమగా అభివృద్ధి చెందిందని గోయల్ అన్నారు. ప్రభుత్వ సహకారం వల్ల ఆ సంస్థ 30 శాతం లాభాలను మూటగట్టుకుందని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ కలిసి పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ సాయంతో నడిచే వాహనాలను ప్రజలు కోనుగోలు చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

ఇది రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్... రాబోయే రోజుల్లో ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పెట్టుబడులకు ఆసక్తి చూపితే అపారమైన ప్రయోజనాలు ఉంటాయని సూచించారు. గత మూడేళ్లలో విద్యుత్ వినియోగం 6.5 శాత పెరిగిందని, గత పదేళ్లతో పోలిస్తే ఇది చాలా అధికమని గోయల్ పేర్కొన్నారు. రెండేళ్లలో 500 మిలియన్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశామని, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వృధాను, వినియోగాన్ని తగ్గించడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యమని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.