కోల్కతా హైకోర్టు శుక్రవారం పశ్చిమ బెంగాల్ మంత్రి కుమార్తెకు గట్టి షాక్ ఇచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు.. 41 నెలల జీతాన్ని వెనక్కి ఇవ్వాలని తేల్చి చెప్పింది. అక్రమ మార్గంలో ఉద్యోగం పొందారని తేల్చిన కోర్టు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరేశ్ చంద్ర అధికారి కుమార్తె అంకిత అధికారి ఉద్యోగాన్ని రద్దు చేసింది. అంకిత నియామకం చెల్లదని, ఇన్నేళ్లుగా ఆమె తీసుకున్న మొత్తం జీతాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆమె ఉపాధ్యాయురాలిగా 41 నెలల పదవీకాలంలో డ్రా చేసిన జీతం తిరిగి ఇవ్వాలని కోరింది. జస్టిస్ అవిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ బెంచ్ నవంబర్ 2018 నుంచి చెల్లించిన జీతాన్ని రెండు విడతలుగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమెను పాఠశాల ఆవరణలోకి రానియకుండా నిషేధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 7వ తేదీలోగా మొదటి విడత, జూలై 7వ తేదీలోగా అంకిత అధికారి తన జీతాన్ని చెల్లించాల్సి ఉంది.
ఉద్యోగ రిక్రూట్మెంట్ పరీక్షలో అధికారి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు సాధించినా తనకు ఉద్యోగం దక్కకుండా చేశారంటూ ఓ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషనర్ తనకు 77 మార్కులు, అంకిత అధికారి 61 మార్కులు సాధించారని పేర్కొన్నారు. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. పైగా ఈ ఉద్యోగ నియామకంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఖాళీ అయిన ఆ పోస్టును పిటిషనర్కు కేటాయించాలని కోర్టు సూచించింది.
కాగా మంత్రి పరేశ్ చంద్ర అధికారి తన కుమార్తె అక్రమ నియామకంపై విచారణ కోసం స్థానిక సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఈ కేసులో విచారణ కోసం సీబీఐ ముందు ఆయన హాజరవ్వడానికి గడువు తేదీ ముగిసిపోవడంతో సీబీఐ అధికారులు మంత్రిపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే మంత్రి కుమార్తెపై ఐపీసీ సెక్షన్లు 420, 120B (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టం కింద వేరే కేసులు కూడా పెట్టారు.
ఉద్యోగ రిక్రూట్మెంట్ పరీక్షలో అధికారి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు సాధించినా తనకు ఉద్యోగం దక్కకుండా చేశారంటూ ఓ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషనర్ తనకు 77 మార్కులు, అంకిత అధికారి 61 మార్కులు సాధించారని పేర్కొన్నారు. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. పైగా ఈ ఉద్యోగ నియామకంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఖాళీ అయిన ఆ పోస్టును పిటిషనర్కు కేటాయించాలని కోర్టు సూచించింది.
కాగా మంత్రి పరేశ్ చంద్ర అధికారి తన కుమార్తె అక్రమ నియామకంపై విచారణ కోసం స్థానిక సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఈ కేసులో విచారణ కోసం సీబీఐ ముందు ఆయన హాజరవ్వడానికి గడువు తేదీ ముగిసిపోవడంతో సీబీఐ అధికారులు మంత్రిపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే మంత్రి కుమార్తెపై ఐపీసీ సెక్షన్లు 420, 120B (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టం కింద వేరే కేసులు కూడా పెట్టారు.