యాప్నగరం

West Bengal: రామనవమి సందర్భంగా హింసాకాండ.. కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రామ నవమి సందర్భంగా హింసాకాండ జరిగింది. చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఓ యువకుడు చనిపోయాడు. ఇది రాజకీయ రచ్చకు కారణమైంది. బీజేపీ వర్సెస్ టీఎంసీ డైలాగ్ వార్ నడించింది. అల్లర్ల కు కారణం మీరంటే.. మీరని.. ఈ రెండు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో.. కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హింసాకాండపై దర్యాప్తు చేయాలని.. ఎన్ఐఏ ను ఆదేశించింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 27 Apr 2023, 2:17 pm

ప్రధానాంశాలు:

  • రామనవమి సందర్భంగా బెంగాల్‌లో హింసాకాండ
  • హౌరా, నార్త్ దినాజ్‌పూర్, ఇస్లాంపూర్‌లో ఘర్షణలు
  • ఘర్ణణలపై దర్యాప్తు చేయాలని ఎన్ఐఏకు ఆదేశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ram Navami Riots
రామ నవమి అల్లర్లు
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రామనవమి (Ram Navami) వేడుకల సందర్భంగా.. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మతపరమైన హింస చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడం, దహనం చేయడం, కొట్లాటలు వంటి ఘటనలు జరిగాయి. పోలీసు వాహనాలు, దుకాణాలు, ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.
ఈ నేపథ్యంలో.. విచారణకు సంబంధించి అవసరమైన అన్ని పత్రాలు, ఎఫ్‌ఐఆర్, సీసీటీవీ ఫుటేజీలను 2 వారాల్లోగా ఎన్‌ఐఏకి అందజేయాలని Calcutta High Court తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్‌ఐఎ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి పిల్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ లభించిన తర్వాత ఎన్‌ఐఏ కేసు దర్యాప్తును ప్రారంభించనుంది.
పశ్చిమ బెంగాల్‌లో రామ నవమి రోజున హౌరా, నార్త్ దినాజ్‌పూర్, ఇస్లాంపూర్‌లో ఊరేగింపులు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణలు జరిగాయి. ఓ యువకుడు చనిపోయాడు. ఆ తర్వాతి రోజుల్లో.. హౌరా, రిస్దా మినహా అనేక చోట్ల శోభా యాత్రలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ విషయంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. టీఎంసీ, బీజేపీ రెండూ హింసను ప్రోత్సహిస్తున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

రామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. హౌరా, ఖరగ్‌పూర్, బరాక్‌పూర్, భద్రేశ్వర్, సిలిగురి, అసన్‌సోల్‌లలో వేలాది మంది ప్రజలు 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ.. ఊరేగింపుల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రామనవమి ఊరేగింపులపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.