యాప్నగరం

బెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు మమత షాక్!

బెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు షాక్ తగిలింది. అనుమతి లభించి 24 గంటలు గడవక ముందే ట్విస్టు చోటుచేసుకుంది.

Samayam Telugu 21 Dec 2018, 7:34 pm
శ్చిమ బెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు షాక్ తగిలింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తలపెట్టిన రథయాత్రకు అనుమతిచ్చి 24 గంటలు తిరగకుండానే కోల్‌కతా హైకోర్టు ట్విస్టు ఇచ్చింది. రథయాత్రకు అనుమతి ఇస్తూ కోల్‌కతా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం గురువారం (డిసెంబర్ 20) ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Samayam Telugu bengal


బెంగాల్‌లో అమిత్ షా రథయాత్రకు కోల్‌కతా హైకోర్టు గురువారం షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతియుతంగా రథయాత్ర చేపట్టాలని సూచించింది. దీన్ని సవాలు చేస్తూ మమతా సర్కార్ శుక్రవారం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం మమతా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావించింది. అందుకు అనుమతి ఇవ్వాలంటూ డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. రథయాత్ర చేపట్టదలచిన ప్రాంతాలు అత్యంత సున్నితమైనవని, మత కలహాలకు ఆస్కారం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపికి అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ.. డివిజన్‌ బెంచ్‌ ఆ తీర్పును రద్దు చేయడం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.