యాప్నగరం

‘మస్తిగుడి’ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లపై కేసు

కన్నడ సినిమా ‘మస్తిగుడి’ షూటింగ్ లో ప్రమాదం జరిగి ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

TNN 8 Nov 2016, 4:50 pm
కన్నడ సినిమా ‘మస్తిగుడి’ షూటింగ్ లో ప్రమాదం జరిగి ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలు ఇప్పటికీ బయట పడలేదు. కాగా సినిమా షూటింగ్ సమయంలో కనీసం భద్రతా చర్యలు చేపట్టని ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్‌లపై కేసు నమోదైంది. ఎక్కడైతే నటులిద్దరూ మునిగి ప్రాణాలు కోల్పోయారో ఆ రిజర్వాయర్ బెంగళూరు వాటర్ సప్లయ్ బోర్డు ఆధీనంలో ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన ఉన్నతాధికారులు నటులు చనిపోవడంపై సినిమా టీమ్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్ డైరెక్టర్ లను ప్రధాన ముద్దాయిలుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu case filed against on maasthigudi producer director stunt director
‘మస్తిగుడి’ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లపై కేసు


అనిల్, ఉదయ్...

మస్తిగుడి సినిమాలో దునియా విజయ్ హీరోగా నటిస్తుండగా, అనిల్, ఉదయ్ విలన్లుగా నటిస్తున్నారు. వారిపై క్షైమాక్స్ చిత్రీకరించేందుకు బెంగళూరు దగ్గర్లోని తిప్పగోండనహళ్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అక్కడ హెలికాఫ్టర్ నుంచి రిజర్వాయర్ లోకి హీరో, విలన్లు దూకే సన్నివేశం చిత్రీకరించారు. ఇందులో అనిల్, ఉదయ్ లకు ఈత సరిగా రాదు. ఆ విషయం తెలిసి కూడా చిత్ర డైరెక్టర్, స్టంట్ మాస్టర్ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. వారికి వెంటనే లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఎలాగో కష్టపడి హీరో ఒడ్డుకు ఈదుకుని వచ్చాడు... కానీ అనిల్, ఉదయ్ మాత్రం మునిగిపోయారు. వారికోసం రిజర్వాయర్ లో వెతుకుతున్నా మృతదేహాలు బయటపడలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.