యాప్నగరం

తమిళనాడులో కట్టలుకట్టలుగా డబ్బు, బంగారం.. వందల కోట్లు సీజ్

తమిళనాడులో మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న సమయంలో వందల కోట్ల డబ్బు, బంగారం పట్టుబడడం సంచలనంగా మారింది. నాలుగు వందల కోట్లకు పైగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 5 Apr 2021, 10:13 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న కొద్ది గంటల ముందు వందల కోట్ల రూపాయల నగదు, బంగారం భారీగా పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నగదు రూ.225.5 కోట్లు, సుమారు రూ.176 కోట్ల విలువైన బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. వాటితో పాటు భారీగా మద్యం, గృహోపకరణాలను కూడా అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా రూ.428 కోట్లు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
money


రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూర్ తదితర చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. అత్యధికంగా కరూర్‌లో భారీగా నగదు పట్టుబడింది. ఆ తర్వాత కోయంబత్తూరు, తిరుప్పూర్, చెన్నైలలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.అలాగే రాణిపేట జిల్లాలో రూ.91 లక్షలు, చెన్నై నగరంలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో సుమారు రూ1.15 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.

ఎన్నికలకు ముందు చివరి మూడు రోజుల్లో నగదు భారీగా తరలించే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సహకారంతో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.