యాప్నగరం

కులాల కార్చిచ్చు.. ముంబైలో తీవ్ర ఉద్రిక్తత

కులాల మధ్య రేగిన చిచ్చు దేశ ఆర్థిక రాజధాని ముంబైని కుదిపేస్తోంది. అట్టుడుకుతున్న ఆందోళనల కారణంగా జనం ఆరుబయటకు రావడానికి భయపడుతున్నారు.

TNN 3 Jan 2018, 12:23 am
కులాల మధ్య రేగిన చిచ్చు దేశ ఆర్థిక రాజధాని ముంబైని కుదిపేస్తోంది. అట్టుడుకుతున్న ఆందోళనల కారణంగా జనం ఆరుబయటకు రావడానికి భయపడుతున్నారు. హింసను వీడి, సంయమనం పాటించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలను కోరారు. దళితులు, మరాఠా సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. భీమా-కోరెగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా పుణె జిల్లాలో ఆ వర్గానికి చెందిన ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి పోటీగా మరాఠా వర్గానికి చెందిన ప్రజలు మరో ర్యాలీ చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారి తీసింది.
Samayam Telugu caste clashes tension grips mumbai maharashtra cm appeals for peace
కులాల కార్చిచ్చు.. ముంబైలో తీవ్ర ఉద్రిక్తత


దళితులు పెద్ద సంఖ్యలో ముంబై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో ముంబై నగరవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. వాహనాలే కాకుండా లోకల్ రైళ్లు కూడా ఆగిపోయాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో చెంబూర్‌తోపాటు పలు తూర్పు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

సోమవారం (జనవరి 1) దళితులపై మరాఠా కమ్యూనిటీ దాడులకు దిగడంతో ఓ వ్యక్తి చనిపోవడంతో పాటు పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. 1818 జనవరి 1న రెండో పీష్వా బాజీరావ్ సేనలపై బ్రిటిష్ సేనలు సాధించిన విజయానికి గుర్తుగా దళితులు సంబరాలు చేసుకున్నారు. అప్పట్లో దళితులు బ్రిటిష్ సేనల్లో భాగంగా ఉన్నారు. ఇది మరాఠా కమ్యూనిటీని ఆగ్రహానికి గురి చేసింది. ఫలితంగా దళితులపై దాడులు జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.