యాప్నగరం

బెంగుళూరు విధ్వంసంపై ఆందోళనకారులకి ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి

న్యాయం కోసం పోరాడాలి అంటే శాంతియుతంగా పోరాడాలి కానీ ఇలా ఆస్తులు విధ్వంసం చేసి, వాహనాలు తగలబెట్టడం...

Samayam Telugu 12 Sep 2016, 11:35 pm
'న్యాయం కోసం పోరాడాలి అంటే శాంతియుతంగా పోరాడాలి కానీ ఇలా ఆస్తులు విధ్వంసం చేసి, వాహనాలు తగలబెట్టడం పోరాటపటిమ అనిపించుకోదు' అని అసహనం వ్యక్తం చేశారు సినీనటుడు ప్రకాష్ రాజ్. బెంగుళూరులో సోమవారం జరిగిన విధ్వంసంపై స్పందిస్తూ ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. " సమస్య తీవ్రతని నేను కూడా అర్థం చేసుకోగలను. వివాదాన్ని పరిష్కరించడానికి నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలున్నాయి, కోర్టులున్నాయి. అవన్నీ కాకుండా ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మన పిల్లలు మన నుంచి ఏం నేర్చుకుంటారు. నిరసన అంటే బస్సులు తగలబెట్టి, ఆస్తులు విధ్వంసం చేయడమేనా " అని ఆందోళనకారులని ప్రశ్నించిన ఆయన.. దయచేసి సంయమనం పాటించి, శాంతియుతంగా వ్యవహరించండి అని పిలుపునిచ్చారు.
Samayam Telugu cauvery issue prakash raj appeals for peace over bangalore protests
బెంగుళూరు విధ్వంసంపై ఆందోళనకారులకి ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి


Let's seek justice ... But not with such inhuman violence. It's painful to see children terrified. PEACE pleassss pic.twitter.com/sLMcCmWlL8— Prakash Raj (@prakashraaj) September 12, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.